ETV Bharat / state

గుడివాడలో గంజాయి బ్యాచ్‌ వేధింపులు - భక్షక ఖాకీలపై చర్యలేవి ? - GANJA BATCH WAS HARASSED FAMILY

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 10:27 AM IST

Updated : Apr 7, 2024, 1:36 PM IST

Special Branch Police Stood by a Family in Gudivada
Special Branch Police Stood by a Family in Gudivada

Special Branch Police Stood by a Family in Gudivada: ఓ స్పెషల్‌ బ్రాంచ్​ పోలీసు స్పందించకుంటే ఒక కుటుంబం కొందరు ఆకతాయిలు వల్ల బలైపోయేది. ఇంటి పక్కనే ఓ శిథిల భవనంలో ఆకతాయిలు మత్తు పదార్థాలను సేవిస్తూ బాలికను వేధిస్తుండేవారు. ఈ విషయంపై బాలిక తండ్రి ఫిర్యాదు చేసినా ఇద్దరు పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోలేదు. వారిపై కనీస చర్యలు లేకపోవడంతో వైసీపీ కండువాలే వారికి రక్షణగా నిలిచాయా అనే చర్చ కృష్ణా జిల్లా గుడివాడలో జోరుగా కొనసాగుతోంది.

గుడివాడలో గంజాయి బ్యాచ్‌ వేధింపులు - ఎస్బీ​ పోలీసులు స్పందించకుంటే ఓ కుటుంబమే బలి !

Special Branch Police Stood by a Family in Gudivada: ఒక స్పెషల్‌ బ్రాంచ్​ పోలీసు స్పందించకపోయి ఉంటే ఈ పాటికి ఓ అమాయకుడు గంజాయి కేసులో కటకటాల పాలయ్యేవాడు. తరచూ యువకుల వేధింపులకు గురవుతున్న ఆయన కుమార్తె జీవితం సర్వనాశనమయ్యేది. అభం శుభం తెలియని కుటుంబం వీధిన పడేది. ఎస్బీ పోలీసు మానవీయ ధోరణి, జిల్లా ఎస్పీ సముచిత మార్గనిర్దేశం బాధిత కుటుంబానికి రక్షా కవచంగా నిలిచాయి. ఈ సంఘటనలో ఇది ఒక పార్శ్వమైతే, బాధితుల మొర వినకుండా తొలి నుంచి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను మాత్రం ఉన్నత అధికారులు వదిలేశారు. వారిపై కనీస చర్యలు లేకపోవడంతో వైసీపీ కండువాలే వారికి రక్షణగా నిలిచాయా అనే చర్చ కృష్ణా జిల్లా గుడివాడలో జోరుగా సాగుతోంది. గుడివాడలో జరిగిన ఈ ఉదంతంలో రెండు పోలీసు స్టేషన్లకు చెందిన ఇద్దరు సీఐలు నిరంకుశంగా వ్యవహరించారు. వారిపై చర్యలకు జిల్లా ఉన్నత అధికారులు సిఫార్సు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వారితో ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు వస్తున్నాయి.

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ లైంగిక వేధింపులు.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు

గుడివాడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఇంటి పెద్ద చిన్న ఫ్యాన్సీ స్టోర్‌ నడుపుతున్నారు. కుమార్తె ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. వారి నివాసం ఎదురుగా ఓ శిథిల భవనం ఉంది. ఆకతాయిలు అక్కడకు వచ్చి మత్తు పదార్థాలను సేవిస్తుంటారు. బాలిక కళాశాలకు వెళ్లి వస్తుండగా వేధిస్తుండేవారు. తలవంచుకుని వచ్చే ఆమె ఒక రోజు భరించలేక తండ్రికి చెప్పడంతో ఇద్దరూ వెళ్లి పోలీసు స్టేషన్‌లో మార్చి 18న తొలిసారి ఫిర్యాదు చేశారు. ఆకతాయిలకు అండగా మరో గంజాయి దళారీ వచ్చి సీఐ ఇంద్ర శ్రీనివాస్‌తో కలిసి చక్రం తిప్పారు. ఈ సారి క్షమించి వదిలేయాలని బాధితులకు పోలీసులు సూచించారు. అయినా వేధింపుల పర్వం ఆగలేదు. మార్చి 20, 22, 24, 26, 29వ తేదీలలోనూ బాధితులు ఫిర్యాదులు చేశారు.

గంజాయి సేవిస్తున్నారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా శిథిల భవనంలోనే ఉంటున్నారని బాలిక తండ్రి సీఐ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన దుర్మార్గులను గట్టిగా మందలించి కేసు నమోదు చేయకుండానే వారిని వదిలేశారు. దీన్ని అలుసుగా తీసుకున్న ఓ దుర్మార్గుడు అమ్మాయి సైకిల్‌పై వస్తుండగా వేధించాడు. చేయి పట్టుకుని ఆపి పెళ్లాడాలని గంజాయి మత్తులో ఒత్తిడి తెచ్చాడు. తాము ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను పోలీసుల ఎదుట బాధితులు మొర పెట్టుకున్నప్పటికీ కేసు పెట్టలేదు. తండ్రీ కుమార్తెలు మార్చి 31న మరోసారి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 1న దిశకు తండ్రి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది.

వేధింపుల ఆరోపణలపై ఇద్దరు సీఐలపై వేటు - వీఆర్​కు పంపించిన ఎస్పీ అన్బురాజన్

దిశకు ఫిర్యాదు అందిన విషయం పోలీసు స్టేషన్‌ నుంచి ఆకతాయిలకు, గంజాయి బ్యాచ్‌కు తెలిసిపోయింది. అంతే బాధితురాలి తండ్రిపై గంజాయి కేసు నమోదుకు వారు ప్రణాళిక రచించారు. ఒక నిందితుడు బాలిక తండ్రి దుకాణానికి వెళ్లి బాక్సు కొంటున్నట్లు నటించి అందులో వెంట తెచ్చిన గంజాయి పెట్టి పోలీసులకు సమాచారమిచ్చాడు. గంజాయి విక్రయిస్తున్నారని పోలీసులు బాలిక తండ్రిని పోలీసుకు స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలికపై వేధింపుల గురించి రోజుల తరబడి ఫిర్యాదు చేస్తే స్పందించని పోలీసులు గంజాయి కేసుపై ఏ మాత్రం విచారించకుండానే కేసు నమోదుకు సిద్ధమయ్యారు. సహచర వ్యాపారులు నెత్తీనోరు బాదుకున్నా వినిపించుకోలేదు. దీన్ని చిత్రీకరించి గంజాయి విక్రయంపై సాక్ష్యాలు ఉన్నాయంటూ ఓ యూట్యూబర్‌ శశి కూడా బెదిరించి ఫిర్యాదులను బాలిక వెనక్కి తీసుకోవాలని రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

వై​సీపీ కౌన్సిలర్​ వేధిస్తున్నారని అటెండర్​ ఆత్మహత్యాయత్నం - సెల్ఫీ వీడియో

ఇదంతా గమనించిన ఎస్బీ పోలీసులు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పకడ్బందీగా విచారణ చేపట్టాలని ఆయన సీఐకి ఆదేశాలిచ్చారు. అప్పటికి స్పందించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా యువకుడు రావడం బాక్సులో గంజాయి పెట్టడం కనిపించింది. దీంతో కేసు మొదటికి వచ్చింది. అప్పుడు శశి, డి. ప్రవీణ్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఒకటో పట్టణ స్టేషన్‌లో మాత్రం అమ్మాయిపై వేధింపుల కనీసం కేసు నమోదు కాలేదు. అక్కడి సీఐ ఇంద్రశ్రీనివాస్‌ పట్టించుకోలేదు. రెండో టౌన్‌లో సీఐ నాగదుర్గారావు బాధితుడిపైనే గంజాయి కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

ఎస్బీ పోలీసు పట్టించుకోకపోయినా, ఎస్పీ అద్నాన్‌ స్పందించకపోయినా కుటుంబం పరిస్థితి అగమ్యమయ్యేది. ఇలాంటి సీఐలు ఎన్నికల నిర్వహణను నిష్పాక్షికంగా చేయగలరా?గుడివాడలో విచ్చలవిడిగా గంజాయి దొరకడానికి కారణమెవరు? సామాన్యులు ఫిర్యాదు చేసినా విక్రేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? గంజాయి మత్తులో అఘాయిత్యాలకు పాల్పడేవారు ఎందరు ? అరికట్టడం శాంతిభద్రతల పరిరక్షణలో భాగమే కదా అని గుడివాడ పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులపై చర్యలకు ఉన్నత అధికారులు సత్వరం స్పందించాలని విన్నవిస్తున్నారు.

ప్రేమ పేరుతో వైసీపీ ఉప సర్పంచ్‌ కుమారుడు వేధింపులు - యువతి ఆత్మహత్యాయత్నం

Last Updated :Apr 7, 2024, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.