ETV Bharat / state

సమస్యలతో స్వాగతం పలుకుతున్న టిడ్కో ఇళ్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 5:16 PM IST

TIDCO housing beneficiaries Allegations
TIDCO housing beneficiaries Allegations

TIDCO housing beneficiaries Allegations: టిడ్కో గృహసముదాయంలో మౌలికవసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా మౌళిక వసతుల పేరుతో సాకులు చెప్పిన ప్రభుత్వం, తాజాగా ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన గృహసముదాయంలో కనీస వసతులు లేకపోవటంతో లబ్ధిదారులు ఆందోళ చెందుతున్నారు. పూర్తి స్థాయిలో వసతులను కల్పించి ఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

TIDCO housing beneficiaries Allegations: పట్టణ పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఇస్తున్నాం, పేదల సొంతింటి కల సాకారమైందంటూ, లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇచ్చి ప్రభుత్వం హడావుడి చేసింది. సొంతిల్లు కల సాకారమైందన్న ఆనందంతో టిడ్కో గృహ సముదాయానికి వెళ్లిన లబ్ధిదారులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇల్లు అప్పగించినందున బ్యాంకు వాయిదాలు లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉండలేని పరిస్థితులు ఉండటంతో ఇటు అద్దెలు, అటు బ్యాంకు వాయిదాలు కట్టడం వారికి భారమవుతోంది. నాలుగేళ్లుగా మౌలికవసతులు కల్పిస్తున్నామని మాటలు చెప్పిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా ఇల్లు అప్పగించడం మినహా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం విఫలమైంది.

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ అలాస్యానికి కారణమెంటీ : సుప్రీం కోర్టు

సమస్యలతో స్వాగతం: పట్టణ పేదలకు నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు నగరంలోని పేదలకు అడవితక్కెళ్లపాడు గృహసముదాయంలో మూడు విభాగాల్లో కలిపి 4వేల 192 ప్లాట్లు, వెంగళాయపాలెం గృహసముదాయంలో మొత్తం 1,888 ప్లాట్లు ఈనెల 6న లబ్దిదారులకు అప్పగించారు. నివాసయోగ్యంగా ఉన్నందున వెంటనే అందులో నివాసాలు ఉండవచ్చని ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహ సముదాయాల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. విద్యుత్తు సౌకర్యం ఇంటింటికి ఇప్పుడిప్పుడే కనెక్షన్లు ఇస్తున్నారు. కొన్ని ఇళ్లకు ఇంకా నీటిసౌకర్యం ఏర్పాటుకాలేదు. అడవితక్కెళ్లపాడు గృహసముదాయంలో కొన్ని భవనాల్లో సివిల్‌ పనులు జరుగుతున్నాయి. భూగర్భమురుగునీటిపారుదల వ్యవస్థ మరమ్మతు పనులు చేస్తున్నారు. అడవితక్కెళ్లపాడు సముదాయానికి ప్రధాన రహదారి సైతం ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఐదేళ్ల కిందట నిర్మించిన సముదాయంలో ఎలక్ట్రికల్‌ వస్తువులు, కిటికీలు తదితర సామగ్రి చోరీకి గురయ్యాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. అంతర్గతంగా ఒక బ్లాక్‌కు రహదారి కూడా నిర్మించలేదు. సముదాయం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి విషపురుగులకు ఆవాసంగా మారాయి.

ఇచిన ఇళ్లు నివాసయోగ్యంగా లేవు. విద్యుత్తు, ఇతర మౌళిక సౌకర్యాలు కల్పించాలి. ఇళ్లు అప్పగించి పదిరోజులైనా ఒక్క కుటుంబం కూడా పూర్తిస్థాయిలో నివాసం ఉండటం లేదు. కొన్ని గృహాలకు ఇంకా స్నానపుగదుల తలుపులు, కిటికీలు కూడా అమర్చలేదు. ఇళ్లలో అంతర్గత సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఇవన్నీ ఇంకా పూర్తికాకుండానే అధికారులు మాత్రం అన్ని లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆర్భాటంగా ఇళ్ల అప్పగింతల కార్యక్రమం చేపట్టినా, ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. టిడ్కో గృహాల లబ్ధిదారులు

ప్రచార పిచ్చి- అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలోనూ సీఎం జగన్​పై నేతల ఆహా ఓహో!

బ్యాంకు రుణాలు: ప్రభుత్వం లబ్ధిదారులకు గృహాలు కేటాయించిన వివరాలను టిడ్కో రుణాలు మంజూరు చేసిన బ్యాంకులకు జాబితా ఇచ్చింది. లబ్ధిదారులు నెలవారి వాయిదాలు చెల్లించాలని బ్యాంకులు కోరుతున్నాయి. వరుసగా మూడు నెలలు వాయిదాలు చెల్లించని పక్షంలో ఎన్​పీఏగా మారుతాయి. లబ్ధిదారులు గృహప్రవేశం చేయకుండానే వాయిదాలు చెల్లించాల్సి వస్తోంది. తమ ఇంటిని శుభ్రం చేసుకోవడానికి వచ్చినవారు కనీస సదుపాయాలు లేకపోవటంతో వెనుకంజ వేస్తున్నారు.
ఎకరం రూ.73 వేలతో 12 వేల ఎకరాలు కొట్టేశారు- జే గ్యాంగ్ భారీ 'భూ'మంతర్' పై 10 ఏళ్లుగా సాగుతున్న విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.