ETV Bharat / state

ఏ1 పేర్ని కిట్టు - హత్యాయత్నం కేసు నమోదుచేసినా అరెస్టు చేయని పోలీసులు - Police Not Arrested Perni Kittu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 7:20 AM IST

Police Not Arrested Perni Kittu
Police Not Arrested Perni Kittu(ETV BHARAT)

Police Not Arrested Perni Kittu: మచిలీపట్నం అరాచక ఘటనలో పోలీసుల పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. హత్యాయత్నం కేసు నమోదుచేసినా పేర్ని కిట్టుని పోలీసులు అరెస్టు చేయలేదు. జనసేన నేత కుటుంబంపై దాడి ఘటనలో ఏ-1గా పేర్ని కిట్టు ఉన్నా ఎన్నికల ప్రచారం యథావిధిగా చేసుకుంటున్నారు.

ఏ1 పేర్ని కిట్టు - హత్యాయత్నం కేసు నమోదుచేసినా అరెస్టు చేయని పోలీసులు (ETV Bharat)

Police Not Arrested Perni Kittu: మచిలీపట్నంలో మాజీమంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టుపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు పక్షపాత వైఖరి చూపుతున్నారు. జనసేన నాయకుడి ఇంటిపై దాడి ఘటనలో యువనేత, ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదుచేసినా పోలీసులు కిట్టును మాత్రం అరెస్టు చేయకుండా స్వామిభక్తి ప్రదర్శించారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా పోలీసులు ఇంకా వైఎస్సార్సీపీ కోడ్‌నే అనుసరిస్తున్నారు. ఆ పార్టీ నేతల అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు జనసేన బీసీ నాయకుడు మహేష్‌ ఇంట్లోకి వెళ్లి గురువారం బీభత్సం సృష్టించారు. ఆ ఘటనలో మహేష్‌ భార్య హేమలతపై కిట్టు అనుచరులు దాడి చేసి, కుటుంబసభ్యులపైనా పిడిగుద్దులు కురిపించారు.

అనంతరం పోలీసుస్టేషన్‌ వద్ద కూడా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు పెట్టి ఏ1గా చేర్చినా ఇంతవరకూ ఆయనను అరెస్టు చేయలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసినా పేర్ని కిట్టు జోలికి వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో కిట్టు తనకు అడ్డే లేదన్నట్లు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు.

జనసేన నేత కుటుంబంపై దాడి- వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు - Murder Attempt Case File

జనసేన నాయకుడు మహేష్‌ భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద మచిలీపట్నం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదుచేశారు. ఈ కేసులో పేర్ని కిట్టును ఏ1గా, ఆయన అనుచరులు చిలకలపూడి గాంధీ, శీనయ్య, చిలంకుర్తి వినయ్‌, ధనబాబు, లంకే రమేష్‌తో పాటు ఇతరులను నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చూపించారు. కిట్టు మినహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి, స్థానిక పీడీఎం కోర్టులో మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. నిందితులకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ నిర్వహించాలని పోలీసులను ఆదేశిస్తూ వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

పేర్ని కిట్టుపై నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధరాత్రి వేళ మచిలీపట్నం పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన అనుచరులతో వెళ్లిన పేర్ని నాని, తెల్లవారుజామున 2 గంటల వరకు సుదీర్ఘంగా పోలీసులతో మంతనాలు జరిపారు. హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి అన్ని గంటల పాటు స్టేషన్‌లో సీఐ సతీష్‌కుమార్‌తో చర్చలు జరపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

దాడికి ఘటనలో బాధితులపైనా పోలీసులు కేసు నమోదుచేశారు. కిట్టు ప్రచారం చేస్తుండగా అకారణంగా జనసేన నేత కర్రి మహేష్‌ కుటుంబసభ్యులు తమపై దాడిచేసి, కులదూషణకు పాల్పడ్డారని దాసరి నాగలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో కర్రి మహేష్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపై పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు.

రెచ్చిపోయిన పేర్ని కిట్టు గ్యాంగ్‌ - జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి - PERNI KITTU FOLLOWERS ATTACK

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.