ETV Bharat / state

'సిద్ధం' ఎఫెక్ట్​ - బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు - గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవస్థలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 1:23 PM IST

Passengers Facing Problems: ప్రజలకు సేవలందించాల్సిన ఆర్టీసీ వైసీపీ సేవలో తరిస్తోంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ నిర్వహిస్తున్న 'సిద్ధం' సభకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. బస్సుల్లేక గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి బస్టాండ్లలోనే పడిగాపులు కాశారు.

Passengers_Facing_Problems
Passengers_Facing_Problems

Passengers Facing Problems: అధికార పార్టీ సిద్ధం సభలతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు పెద్ద ఎత్తున బస్సులను కేటాయించారు. మొత్తం 3 వేల 500 బస్సుల తరలించినట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 675 బస్సులు కేటాయించారు. వివిధ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లేవారు ఉదయం నుంచే బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు బస్సులు వస్తాయో కూడా తెలియదు. వచ్చిన ఒకటో, రెండో బస్సుల కోసం జనం ఎగబడ్డారు. బస్సులపై సమాచారం అడిగినా యాజమాన్యం స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల పడిగాపులు - బస్సుల్లేక గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవస్థలు

కనిగిరి డిపో నుంచి 48 బస్సులను సిద్ధం సభకు కేటాయించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. చీరాల డిపోలో 96 బస్సులు ఉండగా 80 బస్సుల వరకు సభకు వెళ్లాయి. బస్సుల కోసం ప్రయాణికులు చాలా సమయం ఎదురుచూశారు.

బస్సులు ఎప్పుడు వస్తాయని ఆర్టీసీ అధికారులను అడిగితే జగన్​ను వెళ్లి అడగండి అని దురుసుగా సమాధానమిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళగిరి డిపోలో సాధారణ 23 బస్సులు ఉంటే అన్నింటినీ మెదరమెట్ల పంపించామన్నారు. బస్సులో లేకపోవడంతో మంగళగిరి బస్టాండ్ వెలవెలబోతోంది.

జగన్​ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ

సిద్ధం సభకు నెల్లూరు జిల్లాలోని 6 డిపోల నుంచి 332 బస్సులను తరలించారు. దీంతో నెల్లూరు డిపోలో బస్సుల్లేక ప్రాంగణం వెలవెలబోతుంది. బస్సులు లేవన్న విషయం తెలియని ప్రయాణికులు, బస్టాండ్​కు చేరుకొని గంటలు తరబడి వేచి చూశారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రయాణికులు గందరగోళంలో పడ్డారు. ఆర్టీసీ సిబ్బందిని అడిగితే బస్సులు ఎప్పుడొస్తాయో తెలియదని సమాధానం చెప్పడంతో నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సినవారు అధిక ఛార్జీలు వెచ్చించి ఆటోల్లోనే గమ్యస్థానాలకు వెళ్తున్నారు. సామాన్యులను వదిలేసి అధిక పార్టీ సభలకు బస్సులను పంపించడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మార్కాపురం డిపోలో 94 బస్సులు ఉండగా అందులో 70 బస్సులు వైసీపీ సిద్ధం సభకు కేటాయించారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు బస్టాండులో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఒకటి రెండు బస్సుల్లో రద్దీ ఉండడంతో నిల్చుని వెళ్లాల్సి వస్తోంది. సిద్ధం సభకు ఒంగోలు డిపో నుంచి పెద్ద సంఖ్యలో బస్సులను తరలించారు.

సీఎం జగన్ పొలిటికల్ షో - రోడ్లపై నరకయాతన! బస్సులు లేక ప్రయాణికులకు - దారి మళ్లింపుతో డ్రైవర్లకు చుక్కలు!

తెల్లవారుజాము నుంచీ బస్టాండ్ కు వచ్చి ఎదురుచూస్తున్నా, బస్సులు రాలేదని ప్రయాణికులు ఆవేదన వెలిబుచ్చారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజకీయ పార్టీల సభలకు బస్సులన్నీ తరలిస్తే తమ పరిస్థితి ఎంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలు ప్రత్యేకంగా మాట్లాడుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి వద్ద అధిక ఛార్జీలను వాహన యజమానులు వసూలు చేస్తున్నారు.

సిద్ధం సభకు బస్సులను కేటాయించి స్వామిభక్తిని చాటుకుంటున్న ఆర్టీసీ యాజమాన్యం మరో అడుగుముందుకేసి ప్రజా రవాణా సాధనమైన బస్సులను వైసీపీ ప్రచార రథాలుగా మార్చేసింది. కనిగిరిలో కొన్ని బస్సులకు మైకులు పెట్టి భారీ శబ్ధాలతో వైసీపీకి చెందిన పాటలను పాడిస్తూ బస్సుల్లో ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇవి ఆర్టీసీ బస్సులా వైసీపీకి చెందిన ప్రచార రథాల అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

సీఎం సభ కోసం వేలాది ఆర్టీసీ బస్సులు తరలింపు- ఎక్కడి ప్రయాణికులు అక్కడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.