ETV Bharat / state

మంత్రి బుగ్గన ఆర్భాటపు ప్రచారాలు - డోన్‌లో అభివృద్ధి శూన్యమంటున్న స్థానికులు - No Development in dhone

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 7:20 PM IST

No Development in Dhone Assembly Constituency: ఆ మంత్రి మాటల మాంత్రికుడు. తాను చెప్పే కథలతో ఎవరినైనా ఇట్టే నమ్మించగలరు. తన నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని గొప్పలు చెబుతూ నాటకీయంగా ప్రచారాలు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో ఆ మంత్రి చేసిన అభివృద్ధి శూన్యమంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.

No_Development_in_Dhone_Assembly_Constituency
No_Development_in_Dhone_Assembly_Constituency

మంత్రి బుగ్గన ఆర్భాటపు ప్రచారాలు - డోన్‌లో అభివృద్ధి శూన్యమంటున్న స్థానికులు

No Development in Dhone Assembly Constituency: నంద్యాల జిల్లా డోన్‌ను మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం, అందుకోసం కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి బుగ్గన ఎన్నికల వేళ పనులు పూర్తి కాకుండానే హడావిడిగా ప్రారంభోత్సవాలు చేశారు. ఆయన రిబ్బన్ కట్ చేసి రెండు నెలలు పూర్తైనా నేటికీ పనులు జరుగుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

మున్సిపల్‌ కార్యాలయ భవనం, పాతబస్టాండులో అత్యాధునిక కూరగాయల మార్కెట్‌, క్లబ్‌ హౌస్‌, ప్రభుత్వ అతిథి గృహాలు, ఈతకొలను, 100 పడకల ఆసుపత్రి, బీసీ బాలికల పాఠశాల భవనాలు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ తమ హయాంలోనే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాదు జనవరి 28న ప్రారంభోత్సవాలు చేశారు. కానీ వీటిలో చాలా వరకు నేటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

అసంపూర్తి భవనాలు - హడావుడిగా ప్రారంభించిన మంత్రి బుగ్గన

డోన్​లోని కూరగాయల మార్కెట్‌, పాతబస్టాండ్‌ ప్రాంతంలోని మున్సిపల్‌ నిర్మాణాలు కూల్చేశారు. వీటి స్థానంలో అత్యాధునిక కూరగాయల మార్కెట్‌ పేరుతో 16 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 74 స్టాళ్లు, 48 దుకాణాలు నిర్మించారు. మొదటి ఫ్లోర్​లో పనులు పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఇంకా 20 శాతానికిపైగా పనులు పెండింగ్​లో ఉండగానే రిబ్బన్ కట్ చేశారు.

డోన్ పట్టణంలోని రుద్రాక్షగుట్ట వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణాన్ని 36 కోట్లతో చేపట్టారు. 20 కోట్లతో పాఠశాలను మొదటి దశలో నిర్మించారు. ఇందులో కొన్ని తరగతి, కొన్ని ల్యాబ్‌ గదులు నిర్మించారు. ఇందులోనూ ఇంకా 30 శాతం వరకు పనులు పెండింగ్​లో ఉన్నాయి. వసతి గృహం పనులు ఇంకా 50 శాతం వరకు కావాలి. వీటిని కూడా మంత్రి ప్రారంభించేశారు.

బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డికి బిగ్ షాక్ - టీడీపీలో చేరిన డోన్ మార్కెట్​యార్డ్ ఛైర్మన్ - BIG SHOCK TO BUGGANA

డోన్‌ పట్టణంలో ప్రస్తుతమున్న ఆసుపత్రి స్థానంలో 100 పడకల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాడు-నేడు కింద 37 కోట్ల రూపాయలతో 10 ఎకరాల్లో పనులు చేపట్టారు. ఆసుపత్రి ముందువైపు పైభాగంలో రేకులు ఏర్పాటు చేశారు. ఇంకేముంది ఆసుపత్రి భవనమంతా పూర్తయిందేమో అనుకున్నారు. కానీ వెనుక వైపు వెళ్లి చూస్తే పనులు సాగుతున్నాయి.

పైరేకులు, రంగులు వేయాల్సి ఉంది. ఇంకా 20 శాతం పనులు చేయాల్సి ఉండగానే భవనాన్ని హడావుడిగా ప్రారంభించారు. పనులు పూర్తవ్వాలంటే ఇంకా కొన్ని నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. డోన్ పట్టణంలోని రహదారికి ఆనుకుని నిర్మిస్తున్న డ్రైనేజీలకు సైతం గత నెల మొదటి వారంలో ప్రారంభోత్సవాలు చేశారు. అవి కూడా నేటికీ పూర్తి కాలేదు.

"డోన్ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయంటూ ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా ప్రారంభించారు. ప్రారంభించి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా టిడ్కో ఇళ్లు కూడా ఎక్కడా పంపిణీ చేయలేదు. ఇంకా మరో రెండు మూడు నెలలు పనులు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. కల్లబొల్లి మాటలు చెప్తూ రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చూస్తున్నారు". - స్థానికుడు

మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన ఎన్​ఎస్​యూఐ నాయకులు - అరెస్ట్​ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.