ETV Bharat / state

గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు - రాళ్ల దాడి ఘటనలపై ఫిర్యాదు - NDA Leaders Complaint to Governor

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 8:25 PM IST

NDA_Leaders_Complaint_to_Governor
NDA_Leaders_Complaint_to_Governor

NDA Leaders Complaint to Governor: సీఎం జగన్‌ రాయి దాడి అంతా డ్రామా అని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కూటమి నేతలు కలిశారు. చంద్రబాబు, పవన్‌పై జరిగిన రాళ్లతో దాడికి యత్నించిన ఘటనను నేతలు వివరించారు. జగన్‌ రాయి దాడిపై విజయవాడ సీపీతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. సిట్ కార్యాలయం వద్ద కీలకపత్రాల దహనంపైనా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

NDA Leaders Complaint to Governor: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి యత్నం ఘటనలపై కూటమి నేతలు గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా సిట్‌ కార్యాలయం వద్ద కీలక పత్రాల దహనం చేసిన ఘటనపై కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, షరీఫ్‌ తదితరులున్నారు.

అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. జగన్‌పై రాయి దాడి ఓ డ్రామా అని విమర్శించారు. ఆ డ్రామా విఫలమైందని వైసీపీ నేతలకూ తెలుసని అన్నారు. ఈ ఘటనపై విజయవాడ సీపీతో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుల పత్రాలన్నీ తగలబెట్టారన్న వర్ల రామయ్య, తప్పుడు కేసుల పత్రాల కాల్చివేతలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సిట్‌ అధిపతి కొల్లి రాఘురామిరెడ్డి పాత్ర ఉందని మండిపడ్డారు. కొల్లి రాఘురామిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఆరోపించారు.

ఓటమి భయంతో సానుభూతి కోసమే జగన్​ గులకరాయి దాడి డ్రామా: బొండా ఉమ - bonda uma on jagan stone attack

సీఎస్‌ను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరామని వర్ల రామయ్య తెలిపారు. తాము చెప్పిన విషయాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రాయి డ్రామా చేస్తున్నారని టీడీపీ నేత షరిఫ్ విమర్శించారు. దర్యాప్తు చేయకుండా పోలీసు హత్యానేరమని చెప్పడం దారుణమని మండిపడ్డారు. 2019లో కోడికత్తి డ్రామా అని, ఇప్పుడు రాయి డ్రామా చేస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గులకరాయి వేసిన వ్యక్తిని కనిపెడితే 2 లక్షలు బహుమతి అని పోలీసులు పత్రిక ప్రకటన చేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికలు రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరుగుతుందని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ప్రశ్నించారు. 2019లో కోడి కత్తి డ్రామా ఆడారు, కోర్టుకు వెళ్లి సాక్ష్యం మాత్రం ఎందుకు చెప్పరని నిలదీశారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల రాగానే గులకరాయి దాడి అంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హత్యా ప్రయత్నం అంటూ తనకు తాను ఈ డ్రామా వేశారని ఆక్షేపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయని డిమాండ్ చేశారు.

జగన్​ రాయి దాడి ఘటనపై సీబీఐతో విచారణకు టీడీపీ డిమాండ్ - Stone Attack on CM Jagan

"జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి డ్రామా. అది హత్యాయత్నం కాదు. కరెంటు పోతే సెక్యూరిటీ ఆఫీసర్లు ఏం చేశారు. అందుకే ఈ ఘటనలో విజయవాడ సీపీ విచారణ చేస్తే న్యాయం జరగదు. సీబీఐతో దీనిపై విచారణ జరిపించాలి. గతంలో కోడికత్తి కేసులో ఒక అమాయకుడైన శ్రీనుని జైలులో పెట్టినట్టు, ఇప్పుడు మరొకరిని జైలులో పెడతారు. ఇలాంటి తప్పులు జరగకూడదంటే దీనిపై సీబీఐ విచారణ జరగాలి. అదే విధంగా ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ప్రస్తుతం ఉన్న డీజీపీ ఉండటానికి వీలులేదు". - వర్లరామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

"ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి లేనిపోని నాటకాలకు తెరలేపారు. గులకరాయితో ముఖ్యమంత్రిపై యత్యాయత్నం చేయబోయారు అని కేసు పెట్టారంటే ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలనుకుంటున్నారో తెలుస్తోంది. మరోసారి ఇప్పుడు డ్రామాలతో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు". - షరీఫ్‌, టీడీపీ నేత

రాష్ట్రంలో వైసీపీ నాయకులు హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తున్నారు : కొల్లు రవీంద్ర - Kollu Ravindra

గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు - రాళ్ల దాడి ఘటనలపై ఫిర్యాదు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.