ETV Bharat / state

వనమంతా జనమయ్యే వేళాయే - తెలంగాణలో నేటి నుంచి మేడారం మహా జాతర

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 8:34 AM IST

Medaram Jatara 2024 : వనమంతా జనమయ్యే వేళ, ఆ జనం మధ్యకే వచ్చి వన దేవతలు నీరాజనాలు అందుకునే శుభ ముహూర్తం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు మేడారంలో అంగరంగ వైభవంగా సమ్మక్క - సారలమ్మ జాతర జరగనుంది. ఈ సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. రేపు సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. ఈ నెల 23న రాష్ట్రపతి, సీఎం సహా ప్రముఖులు మహా జాతరకు రానున్నారు.

Medaram_Jatara_2024
Medaram_Jatara_2024

వనమంతా జనమయ్యే వేళాయే - నేటి నుంచి మేడారం మహా జాతర షురూ

Medaram Jatara 2024 : తెలంగాణ రాష్ట్రంలో మాఘమాసం పౌర్ణమి వెలుగుల్లో మేడారం మహా జాతర అట్టహాసంగా ప్రారంభమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే జనజాతర పూర్తిగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. నాలుగు రోజుల పాటు కోలాహలంగా వనంలో జరిగే సంబురమిది. ఆదివాసీ జాతరలో తొలి రోజు పూజారులు వెంటరాగా, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వేంచేయనున్నారు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్

Medaram Sammakka Saralamma Jatara 2024 : ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు (Pagididda Raju) మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసి, ఈరోజు రాత్రికి గద్దెల వద్దకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు డప్పు, డోలు వాద్యాల నడుమ గద్దెలపైకి విచ్చేస్తారు.

"ఈరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తాం. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తాం. ఆ తర్వాత గద్దెలపైకి తీసుకువస్తాం. గురువారం సమీపంలోని చిలకలగుట్ట పైనుంచి కుంకుమ భరిణె రూపంలో సమక్కను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తాం. శుక్రవారం నిండు జాతర కాగా, శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది." - అరుణ్ కుమార్, మేడారం పూజారి

పెళ్లికొడుకైన పగిడిద్దరాజు- అట్టహాసంగా సమ్మక్క జాతర ప్రారంభోత్సవం

కన్నెపల్లి నుంచి జంపన్నను డప్పుడోలు వాద్యాలతో కోలాహలంగా జంపన్న వాగు సమీపంలోని గద్దెకు చేర్చారు. అనంతరం జంపన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ సంప్రదాయాలతో జంపన్నను కొలిచారు. జాతరను పురస్కరించుకుని మేడారం (Medaram Jatara 2024) విద్యుద్దీప కాంతులతో శోభాయమానమైంది. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ క్షణం కూడా విరామం లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి.

పిల్లా పాపలను వెంటపెట్టుకుని అమ్మల దర్శనం కోసం భక్తజనం ఆతృతతో విచ్చేస్తున్నారు. మేడారం పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల కిక్కిరిసిపోతున్నాయి. ఇక ములుగు జిల్లా పరిసర గ్రామస్తులు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎడ్ల బళ్ల పైన విచ్చేస్తున్నారు. నేటి నుంచి హెలికాఫ్టర్ సేవలూ అందుబాటులోకి వస్తున్నాయి.

వన దేవతల దర్శనానికి వేళాయే - 'మండమెలిగే'తో మహా జాతరకు సిద్ధమైన మేడారం

మరోవైపు పోలీసు శాఖ బందోబస్తు కోసం 14,000ల మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం పోలీసు, రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారనే అంచనాలతో మేడారంలో 52 ఎకరాల్లో ప్రయాణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దామని అధికారులు తెలిపారు. భక్తులకు ఆన్‌లైన్‌లో ప్రసాద వితరణ సేవలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.

Sammakka Sarakka Jatara 2024 : జంపన్నవాగు వద్ద భక్తుల పుణ్య స్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలామని అధికారులు వివరించారు. పిల్లలు, వృద్ధుల కోసం ఐదు వేలకుపైగా జల్లు స్నానాల ఘాట్లపై అందుబాటులో ఉంచినట్లు, మేడారం పరిసరాల్లో 5,730 మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

Medaram Jatara Income 2022: రూ.10 కోట్లు దాటిన మేడారం జాతర ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.