ETV Bharat / state

పెండింగ్​లో 25 లక్షల ఎల్​ఆర్​ఎస్ ​దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కార్​ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 11:07 AM IST

Layout Regularization Scheme in Telangana : తెలంగాణలో లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్​ఆర్​ఎస్​) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది గత మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ విధానం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

Telangana LRS Scheme 2024
Layout Regularization Scheme in Telangana

Layout Regularization Scheme in Telangana : తెలంగాణలో లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్​ఆర్​ఎస్​) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది గత మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైచిలుకు దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ విధానం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

Illegal Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లు.. అనధికార వసూళ్లు!!

Telangana LRS Scheme 2024 : రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పెండింగ్​ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై త్వరలో స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తే ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు సైతం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి

Layout Regularization Scheme : దరఖాస్తుల పరిశీలనకు న్యాయస్థానాల నుంచి అప్పట్లో అనుమతి లభించడంతో క్షేత్రస్థాయి పరిశీలనను అధికారులు పూర్తిచేశారు. ఆ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టారు. తొలిదశలో దరఖాస్తుల పరిశీలన రెండో దశలో ఆయా స్థలాలు క్రమబద్ధీకరణకు అర్హమైనవా? కాదా? అని గుర్తించడం.. అర్హతలు ఉన్నట్లు భావిస్తే సిఫార్సు చేయడం మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలంటూ నోటీసుల జారీకి అనుమతించడం. ఈ మేరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

LRS: ఎల్​ఆర్​ఎస్​ లేఅవుట్ల పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) : 2020లో కేవలం రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం నోటీసులు అందుకున్నవారు అయోమయంలో ఉన్నారు. నిర్ధారిత ఫీజును చెల్లించిన పక్షంలో కోర్టుల్లోని వ్యాజ్యాలు ఎప్పటికి కొలిక్కి వస్తాయన్న సందేహం దరఖాస్తుదారుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫీజులు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇంటి నిర్మాణం అనివార్యం అనుకున్నవారే ఆయా మొత్తాలను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ : దాదాపు 20 శాతం వరకు దరఖాస్తులు అర్హమైనవి కావని అధికారులు గుర్తించినట్లు సమాచారం. మిగిలిన దరఖాస్తుల్లో కొన్నింటిలో న్యాయస్థానం తీర్పునకు లోబడి ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి యజమాని దారుడు అదనపు ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చిన పక్షంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్మాణ ప్లాన్‌కు అనుమతి మంజూరు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న అనేక పథకాలకు భారీగా నిధులు అవసరమైన నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనను వినిపించేందుకు వీలుగా న్యాయ నిపుణులను సంప్రదించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సందిగ్ధంలో సర్కారు: ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏం చేద్దాం.. ఎలా ముందుకెళదాం?

land Regularization : భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.