ETV Bharat / state

రాజధాని అమరావతి పరిధి గ్రామాల్లో భూసేకరణ రద్దు - అంతా జగనన్న ప్లానే - Land Acquisition Withdrawal

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 10:29 AM IST

land_acquisition_withdrawal_in_various_villages_under_amaravati
land_acquisition_withdrawal_in_various_villages_under_amaravati

Land Acquisition Withdrawal In Various Villages Under Amaravati : రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

Land Acquisition Withdrawal In Various Villages Under Amaravati : రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దురుద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు.

హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు, సీఆర్‌డీఏ చట్టం, భూసమీకరణ పథకం నిబంధనలకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నిర్ణయం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ భూముల వ్యవహారంలో అవార్డు జారీ చేశారన్నారు. రాజధాని నగరం అమరావతిని ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతో దురుద్దేశపూర్వకంగా భూసేకరణ ప్రక్రియను ఉపసంహరించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి రాజధాని అమరావతిని ధ్వంసం చేసేందుకు నిరంతరం యత్నిస్తున్నారన్నారు.

అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైసీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు

Land Acquisition Problems in Amaravati : హైకోర్టు పలు సందర్భాల్లో రాజధాని అమరావతిని కాపాడుతూ ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్ల కారణంగా రాజధాని ప్రాంతంలో అక్కడక్కడ వ్యవసాయ భూములు మిగిలిపోతాయన్నారు. దీంతో రాజధాని నగర అభివృద్ధికి అవరోధం కలుగుతుందని తెలిపారు. రాజధాని బృహత్తర ప్రణాళికకు(మాస్టర్‌ ప్లాన్‌) మార్పులు చేయడానికి వీల్లేదన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి తప్ప దానిని ఉపసంహరించడానికి వీల్లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపసంహరణ కోసం కలెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. 625 ఎకరాల భూసేకరణ ఉపసంహరణ నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని కోరారు.

మధ్య తరగతికి జగనన్న స్మార్ట్‌ మోసం - అమరావతిలో ప్లాట్లు కొన్నవారికి కష్టాలు - Amaravati Township

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌, టౌన్‌, కంట్రీప్లానింగ్‌ డైరెక్టర్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌, వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

రాజధాని రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు - సీఆర్డీఏ మూడో విడత లాటరీ

అమరావతి విఛ్చిన్నమే అజెండాగా జగన్‌ సర్కార్‌ కుట్రలు - భూసేకరణ ప్రకటన ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.