ETV Bharat / state

ఎన్నికల కోడ్​ మర్చిపోయారా? రంగుల కథేెంది సారూ! - YSRCP Colors For Govt Buildings

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 4:50 PM IST

jagan_photos_and_ysrcp_colors_for_govt_buildings
jagan_photos_and_ysrcp_colors_for_govt_buildings

Jagan Photos and YSRCP Colors For Govt Buildings : ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాలు ముమ్మరమవడం సహజమైన విషయమే. ఏడాది పొడవునా పార్టీ డప్పు కొట్టుకుంటే ఏమవుతుందీ అని అతిగా ప్రవర్తించిన అధికార పార్టీకి రంగుల రచ్చ మొదలైంది. హోలీ కాదండోయ్​ లేని గొప్పలకు పోయి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలకు వేసిన అధికార పార్టీ రంగులు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి.

ఎన్నికల కోడ్​ మర్చిపోయారా? రంగుల కథేెంది సారూ!

Jagan Photos and YSRCP Colors For Govt Buildings : ఎటు చూసినా, ఎక్కడ పర్యటించినా నీలి పరదాలు సీఎం సారుకు నేస్తాలు అది విధితమే. కానీ ప్రజలకు ఎటు చూసినా వైఎస్సార్సీపీ వర్ణాలే కనిపించాలని జగనన్న చేసిన పని ఎన్నికల కోడ్​ వేళ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. సొమ్ము ఒకడిది సోకొకడిది అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన భవనమైనా మన పార్టీ రంగు పెయింటే ఉండాలని బిల్డింగ్​లకు నీలి రంగు కొట్టిన సంగతి తెలిసిందే.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నా నేటికీ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వైఎస్సార్సీపీ రంగులు దర్శనమిస్తున్నాయి. కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి ట్యాంకులు , ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న పార్టీ రంగులను తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు.

ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి - కేంద్ర పథకాలకు పార్టీ రంగులు

YSRCP Colors to Water Tank in Kakinada district : ప్రజలకు ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కల్పించకపోయినా వ్యాపార సంస్థల సహాకారంతో నిర్మించిన నీటి ట్యాంకులకు మాత్రం పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకుంటుందని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో ఇప్పుడు ఆ రంగులు తొలగించడం గ్రామీణ పంచాయతీలకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుంచి హైకోర్టు పలు మార్లు ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసి ప్రజాధనాన్ని వృథా చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

చివరకు ప్రార్థన మందిరాలను వదలరా - వైసీపీ రంగుల రాజకీయం ప్రచారం పిచ్చి పీక్

ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి కూడా వైఎస్సార్సీపీ జెండా రంగే అవడంతో ఆ రంగు తొలగించాలన్నా కొత్త రంగు వేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఆరోగ్యశాఖ అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. మొదట్లోనే హైకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా జగన్ చేసినపని ప్రచారపిచ్చి కాక మరేంటి అని ప్రజలు తిట్టుకుంటున్నారు.

ఆ కేంద్రాలకు పార్టీ రంగు తొలగించాం: ప్రభుత్వం

YSRCP Colors Problems : ఇప్పుడు మళ్లీ రంగులు తొలగించాలంటే కొంత సొమ్ము ఖర్చు అవుతుందని ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ కొత్త రంగులకు ఖర్చు చేస్ సొమ్ము ఎవరి జేబు నుంచి లూటీ చేస్తారని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్​ వచ్చినందున ఇప్పుుడు ఆ రంగుల వల్ల ఇక్కట్లు మరీ ఎక్కువవుతున్నాయి.

టిడ్కో గృహాలకు రంగులు మార్చడంపై తెదేపా ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.