ETV Bharat / state

జగన్‌ త్వరగా కోలుకోవాలి - ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల ఆకాంక్ష - CONDEMNED ATTACK ON CM JAGAN

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 7:06 AM IST

Updated : Apr 14, 2024, 9:00 AM IST

Eminent Leaders Condemned the Attack on CM Jagan: బస్సు యాత్రలో సీఎం జగన్​పై జరిగిన దాడిని ప్రముఖ రాజకీయ నేతలు ఖండించారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని దీనిపై వెంటనే విచారణ జరపాలని కోరారు. కాగా ఎన్నికల ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని టీడీపీ నేతలు విమర్శించారు.

attack_on_cm_jagan
attack_on_cm_jagan

జగన్‌ త్వరగా కోలుకోవాలి - ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల ఆకాంక్ష

Eminent Leaders Condemned the Attack on CM Jagan: బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. సీఎం జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరగా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు చెప్పారు. ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని అనుకుంటున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

జూన్‌ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - Chandrababu Election Campaign

సీఎం జగన్‌ త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నానని అన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Tamil Nadu CM MK Stalin) హితవు పలికారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ (Kalvakuntla Taraka Rama Rao) ఎక్స్‌లో ఆకాంక్షించారు. జగన్‌పై రాయి విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంపీగా వైఎస్‌ బిడ్డ కావాలో, హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి: షర్మిల - YS Sharmila Election Campaign

జగన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి స్పందన కరవవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శించారు. సీఎం పర్యటన జరుగుతుంటే అదే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా అని ప్రశ్నించారు. సానుభూతి కోసం పాకులాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ (TDP MLA Payyavula Keshav) ఆరోపించారు. దాడి జరిగిన నాలుగు నిమిషాల్లోనే క్యాట్‌ బాల్‌ ఉపయోగించారని సాక్షి సహా జగన్‌ అనుకూల మీడియాకు ఎలా తెలిసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

షర్మిల Vs విమల - కుటుంబ సభ్యుల పరస్పర ఆరోపణలతో హీటెక్కుతోన్న పులివెందుల - YS SHARMILA VS YS VIMALA REDDY

తాడేపల్లి ప్యాలెస్‌ డైరెక్షన్‌లో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి (DGP Rajendranath Reddy), ఇంటెలిజెన్స్‌ ఐజీ సీతారామాంజనేయులు ఆడిన నాటకంలో భాగంగానే దాడి జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దాడి జరిగితే డీజీపీ, నిఘా విభాగాధిపతి ఏం చేస్తున్నారని వంగలపూడి అనిత అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌కు ప్రమాదవశాత్తు గాయమైందని భావిస్తున్నానని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అలాకాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని జగన్‌కు గాయం కావడం బాధాకరమన్నారు.

Last Updated : Apr 14, 2024, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.