ETV Bharat / state

'గొంతెండుతోంది మహాప్రభో' - వేసవికి ముందే తాగునీటి సమస్య జఠిలం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 4:03 PM IST

Drinking Water Problem in the State: కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం సమస్యను మరింత జఠిలం చేసింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ప్రభుత్వ తీరుతో మరిన్నీ కష్టాలు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు దాహం తీర్చుకునేందుకు ఏం చేయాలో అర్దం కాని పరిస్థితుల్లో పడ్డారు.

drinking_water_problem
drinking_water_problem

Drinking Water Problem in the State : వేసవి రాక ముందే పల్లెలు గొంతెండుతున్నాయి. తాగునీటి కోసం నెల రోజులుగా అల్లాడుతున్న గ్రామీణులు జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మరిన్ని అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నాళ్లుగా తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ, గురువారం నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిపి వేయాలని ఆదేశాలివ్వడం గందరగోళ పరిస్థితులకు దారి తీసింది.

అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణుల ఆందోళనలు - తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్

దీంతో ప్రకాశం, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లోని వందల గ్రామాలకు తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోగా చాలా జిల్లాల్లో తాగునీటి సమస్య జనవరి నుంచే మొదలైంది. క్రమంగా అది మరింత తీవ్రం దాల్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దానిపై సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పక్కనే కృష్ణమ్మ అయినా తీరని దాహార్తి

ట్యాంకర్లతో నీళ్ల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సింది పోయి సమస్యను మరింత జఠిలం చేసింది. తక్కువ ట్రిప్పులు సరఫరా చేసి ఎక్కువగా చూపిస్తున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. వాస్తవానికి ట్యాంకర్లకు ట్రాకింగ్‌ సిస్టం ఉన్నా.. అది సరిగా పని చేయడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవకతవకలను నిరోధించేందుకు సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నా ఇంతకుముందే ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ట్యాంకర్లు ఆపేయడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.

తాగునీటి కోసం చందాలు వేసుకున్న ప్రజలు - గ్రామంవైపు కన్నెత్తి చూడని అధికారులు

రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో రోజూ 80 గ్రామాలకు ట్యాంకర్లతో తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ఆ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుండగా ప్రజలు శుక్రవారం నుంచి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసేందుకు సిద్ధమయ్యారు.

పనికి వెళ్లాలా? నీళ్లు పట్టుకునేందుకు కాపలా ఉండాలా! - తాగునీటి కష్టాలపై బందరు మహిళల ఆగ్రహం

ట్యాంకర్లతో నీటి సరఫరా తీరుపై సమగ్ర పరిశీలన చేసే బాధ్యత ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ప్రస్తుతం నీళ్లు సరఫరా చేస్తున్న గ్రామాల్లో సమస్య ఉందా? లేదా? అనే వివరాలు ఆరా తీయడంతో పాటు ట్యాంకులు రోజూ వెళ్తున్నాయా? లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. నిత్యం ఎన్ని గ్రామాలకు, ఎన్ని ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు? ఇందులో అవకతవకలు జరుగుతున్నాయా? అనే అంశాలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. అన్ని జిల్లాల నుంచి నివేదికలు అందిన తర్వాతే ట్యాంకర్ల ద్వారా తాగు నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.

అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన తాగునీటి సరఫరా - స్థానికులతో కలిసి మేయర్​ భర్త నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.