ETV Bharat / state

గులకరాయి కేసులో A1కి 14 రోజుల రిమాండ్ - A2 ఎవరో వెల్లడించని అధికారులు - Cm Jagan Stone Pelting Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 4:29 PM IST

Updated : Apr 19, 2024, 6:56 AM IST

Cm Jagan Stone Pelting Case
Cm Jagan Stone Pelting Case

CM Jagan Stone Pelting Case: ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయవాడ కోర్టును అనుమానితుడిని తీసుకువచ్చి హాజరుపరిచారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఏ2 ఎవరో తెలియజేయకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

CM Jagan Stone Pelting Case : సీఎం జగన్‌పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ అలియాస్‌ సత్తిని నిందితుడిగా తేల్చారు. ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్​పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నదీ తేల్చకుండానే కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏ2 ఏవరో? : సీఎంపై రాయి దాడి కేసులో వడ్డెరకాలనీకి చెందిన ఐదుగురిని ఈ నెల 16 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్‌ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్‌ అరెస్టును గురువారం మధ్యాహ్నం చూపించారు. ఘటన జరిగి ఆరు రోజులైనా అరకొర సమాచారంతోనే రిపోర్టు తయారు చేశారు. సీఎంపైకి సతీష్‌ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.

'నాన్న ఎక్కడ - ఎప్పుడొస్తారు ?' - అమ్మను ప్రశ్నిస్తున్న దుర్గారావు పిల్లలు - Jagan Stone Attack Case

దుర్గారావు ఎక్కడున్నాడు? : ఈ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న టీడీపీ నాయకుడు దుర్గారావు ఆచూకీ ఇంత వరకు తెలియరాలేదు. అతడిని రిమాండ్‌ రిపోర్టులోనూ నిందితుడిగా చూపించలేదు. రెండు రోజులైనా అతని పాత్రపై ఇంకా తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దుర్గారావు ఆచూకీ కోసం అతని భార్య, పిల్లలు, బంధువులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దుర్గారావును వదిలిపెడతారా? లేక అరెస్టు చూపిస్తారా? అనే దానిపై పోలీసులు నోరు విప్పడం లేదు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది.

సీఎంపై దాడి కేసులో యువకులు అరెస్ట్‌ - సీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు నిరసన - Attack on CM Jagan

పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు : సీఎం ప్రయాణించిన బస్సుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌టవర్‌ డంప్‌ విశ్లేషణ, సీడీఆర్‌ల ద్వారా సతీష్‌ను నిందితుడిగా తేల్చామని పోలీసులు అంటున్నారు. రిమాండ్‌ రిపోర్టులో పలువురు సాక్షులను విచారించాలని, సాంకేతిక ఆధారాలను సేకరించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సతీష్‌ను విచారించినా ఆధారాలను పూర్తి స్థాయిలో సంపాదించలేదు. కేవలం ఏ2 చెప్పిన మీదటే జగన్‌పైకి రాయి విసిరాడని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ కారణంతో నిందితుడు దాడికి పాల్పడ్డాడనే విషయాన్ని బయటపెట్టలేదు. ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్​పై గులకరాయి దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - stone Attack on Jagan

Last Updated :Apr 19, 2024, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.