ETV Bharat / politics

ఫ్యాన్ వేడిగాలి తట్టుకోలేక- దూసుకుపోతున్న సైకిల్ ఎక్కి సేదతీరుతోన్న వైసీపీ నేతలు - YSRCP leaders Join In TDP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 8:25 AM IST

YSRCP leaders Join In TDP
YSRCP leaders Join In TDP

YSRCP leaders Join In TDP: అధికార వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరికలు రోజురోజుకు జోరందుకుంటున్నాయి. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను తోడుకుని టీడీపీలో చేరుతున్నారు. దీంతో పలు స్థానాల్లో వైఎస్సార్సీపీ ఖాళీ అవుతోంది. రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే కూటమి అధికారంలోకి రావాలని నాయకులు తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని టీడీపీ కండువ కప్పుకున్న నేతలు స్పష్టం చేస్తోన్నారు.

YSRCP leaders Join In TDP : వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఖాళీ అయింది. రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే కూటమి అధికారంలోకి రావాలని నాయకులు తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

  • ఎన్టీఆర్ జిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలోని 18 వ వార్డులో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో 45 కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరితోపాటు వైసీపీ బూత్ కన్వీనర్ గోపి పసుపు కండువా కప్పుకున్నారు. జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో టీడీపీ నేత శ్రీరాం చినబాబు సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు.

వేడెక్కిన రాజకీయాలు - ఓవైపు ప్రచార హోరు, మరో వైపు వలసల జోరు - ELECTION CAMPAIGN IN AP

  • కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో మోపిదేవి మండలం కె.కొత్తపాలెం ఎంపీటీసీ లత, మరో ఇరవై మంది జనసేన పార్టీలో చేరారు. 22వ తేదీన నామినేషన్ వేస్తున్నట్లు మండలి తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
  • పల్నాడు జిల్లా గురజాలలో కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. చిలకలూరిపేటలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో చిలకలూరిపేటకు చెందిన 80 కుటుంబాలతోపాటు గంగన్నపాలేనికి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
  • తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీక్ షాక్ తలిగింది. డక్కిలిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి, వైసీపీ నేత, మాజీ మండల కన్వీనర్ రంగినెని రాజా మరో ఏడుగురు సర్పంచ్‌లు టీడీపీలో చేరారు. వీరిని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాధవ్ నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.

ఊపందుకున్న కూటమి నేతల ప్రచారాలు- భారీగా తెలుగుదేశంలోకి చేరుతున్న వైఎస్సార్సీపీ నేతలు - Election Campaign Gaining Momentum

  • వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కమలాపురం నియోజకవర్గంలో వల్లూరు, చింతకొమ్మదిన్నె. వీరపునాయుని పల్లె మండలాలకు చెందిన 90 కుటుంబాలు పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.
  • నంద్యాల జిల్లా డోన్‌లోని త్రివర్ణ కాలానికి చెందిన మాజీ కౌన్సిలర్ దస్తగిరి, ఆయన అనుచరులు వైసీపీను వీడి పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్సార్సీపీకి గుడ్​బై- రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనలో భారీగా చేరికలు - YCP JOINed JSP AND TDP

ఫ్యాన్ వేడిగాలికి తట్టుకొలేక - దూసుకుపోతున్న సైకిల్ ఎక్కిన వైఎస్సార్సీపీ నేతలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.