ETV Bharat / politics

"రోడ్లు గిట్లుంటే ఓట్లెట్ల పడ్తయ్ సామీ" - ఏపీ రహదారుల దుస్థితిపై మంత్రి తుమ్మల రియాక్షన్ - TS MINISTER ON AP DAMAGED ROADS

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 10:58 AM IST

Minister Tummala Reaction on Damaged Roads in AP : ఆంధ్రప్రదేశ్​లో రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏ జిల్లాలో చూసినా గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. వాహనదారులు ప్రమాదాలకు గురై చనిపోతున్నా, జగన్​ సర్కారు నిమ్మలకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఏపీ రోడ్డుపై రాష్ట్ర వ్వవసాయశాఖ మంత్రి తుమ్మల ప్రయాణం చేయగా, ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏపీ ఆర్​అండ్​బీ అధికారికి వెంటనే ఫోన్​ చేసి మాట్లాడారు.

Minister Tummala Impatience on AP Roads
Minister Tummala Reacts on AP Roads

Minister Tummala Reacts To AP Roads Damage : ఆంధ్రప్రదేశ్​ను ఉద్ధరిస్తున్నామంటూ నిత్యం డప్పు కొట్టుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలు, అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. మాట్లాడితే చాలు ప్రజల ఖాతాల్లో నేరుగా వేల కోట్ల రూపాయలు వేశామంటున్న జగన్‌, రహదారుల మరమ్మతులను అటకెక్కించారు. గ్రామ స్వరాజ్యం అంటూ ప్రజలను మభ్యపెడుతున్న పాలకులు, కనీసం రోడ్లపై గుంతల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలాలు కనిపించడం లేదు. అల్లూరి జిల్లాలోని ఎటపాక- కన్నాయిగూడెం రహదారే ఇందుకు నిదర్శనం. ఇదే రోడ్డుపై మంత్రి తుమ్మల ప్రయాణించగా ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.

అల్లూరి జిల్లాలోని ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. నిండా గోతులే ఉన్నాయి. దీనిపై తుమ్మల ప్రయాణించగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఈ రోడ్డు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవంటూ' ఏపీ అధికారికి సూచించారు. ఈ రోడ్డును మీరు మరమ్మతులు చేయిస్తారా లేదంటే, మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్‌ వర్క్‌ చేయించమంటారా అని ఏపీ ఆర్‌అండ్‌బీ అధికారిని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల బుధవారం భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్తూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక- కన్నాయిగూడెం రహదారిలో ప్రయాణించారు.

ఎదురుగా బండొస్తే గల్లంతే- కరకట్ట దారిలో కాచుకున్న మృత్యువు! - People Problems with Damaged Roads

అల్లూరి జిల్లాలోని ఎటపాక, చింతలగూడెం, కన్నాయిగూడెం ప్రాంతాల్లో పెద్దపెద్ద గుంతలు పడి వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోడు స్థితిపై మంత్రి తుమ్మల, ఏపీ ఆర్‌అండ్‌బీ సీఈ శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 8వ కిలో మీటర్లు అధ్వానంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్‌అండ్‌బీ మంత్రిగా పని చేశానని తుమ్మల అన్నారు. దుమ్ముగూడెం- చర్ల రోడ్డు పనులు చేయిస్తున్నప్పుడే, ఎటపాక నుంచి కన్నాయిగూడెం గ్రామాల మధ్య ఈ 8 కి.మీ. దూరం రోడ్డు వేయించానన్నారు. ఆ తర్వాత కనీసం మరమ్మతులు కూడా చేయించినట్లు లేదని ఆయన ప్రశ్నించారు. మీరు చేయలేకపోతే మేమే మా రాష్ట్ర నిధులతో ప్యాచ్‌ వర్క్స్‌ చేయిస్తామని మంత్రి తుమ్మల స్ఫష్టం చేశారు. మంత్రి ఫోన్‌కాల్‌పై స్పందించిన సీఈ శ్రీనివాసరెడ్డి త్వరలో మరమ్మతులు చేస్తామని ఆయనతో చెప్పారు.

వేసిన 3 నెలలకే పెచ్చులూడిపోయిన రోడ్డు - ఓట్ల కోసమే వేశారని స్థానికుల ఆగ్రహం - వీడియో వైరల్​ - Road conditions in tribal villages

అడుగుకో గొయ్యి - గజానికో గుంతో అధ్వానంగా రాష్ట్ర రహదారులు - Road conditions in Krishna district

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.