ETV Bharat / politics

'జైలుకు, బెయిల్‌కు మధ్య ఊగిసిలాడుతున్న జగన్ జీవితం- ప్యాక్‌ చేసి జైలుకు పంపిస్తాం' - Chandrababu Pawan Joint Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 10:36 AM IST

Chandrababu and Pawan Joint Election Campaign: వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా ఏర్పడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలసి ఆయన పాల్గొన్నారు.

Chandrababu_and_Pawan_Joint_Election_Campaign
Chandrababu_and_Pawan_Joint_Election_Campaign

'జైలుకు, బెయిల్‌కు మధ్య ఊగిసిలాడుతున్న జగన్ జీవితం- ప్యాక్‌ చేసి జైలుకు పంపిస్తాం'

Chandrababu and Pawan Joint Election Campaign: అహంకారి జగన్‌ విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. జైలుకు, బెయిల్‌కు మధ్య ఊగిసిలాడే జీవితం జగన్‌దన్న పవన్‌ వైసీపీ ప్రభుత్వాన్ని ప్యాక్‌ చేసి జగన్‌ను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

అందాల కోనసీమను భవిష్యత్తులో బంగారు సీమగా మార్చడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా ఏర్పడినట్లు వివరించారు. కూటమికి ఎవరైనా అడ్డుగా నిలబడితే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. బటన్‌ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత, వైసీపీ నేతలు దోచింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని చంద్రబాబు సవాల్‌ విసిరారు. దళితులకు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని స్పష్టం చేశారు.

వ్యాసరాయ మఠం భూములపై వైసీపీ నేత కన్ను- ఎలాగైనా కొట్టేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు - Vyasaraya Math Lands Kabza

ఆడ బిడ్డలకు భద్రత కల్పించని, యువతకు ఉద్యోగాలు ఇవ్వని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించని వైసీపీ ప్రభుత్వం అవసరమా అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. కోనసీమలో శాంతిభద్రతలు కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కోనసీమ వాసుల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు రైలును తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

"కోనసీమను బంగారు సీమగా చేస్తాం. ఐదేళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. అహంకారి జగన్‌ విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోకపోతే శాశ్వతంగా దక్కించుకోలేం. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో నంబర్‌ వన్‌గా మారింది. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. బటన్‌ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత, వైసీపీ నేతలు దోచింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా?" - చంద్రబాబు, టీడీపీ అధినేత

"వైసీపీ నేతలు కోనసీమను కలహాల సీమగా మార్చారు. కోనసీమలో చిచ్చుపెడితే సహించేదే లేదు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాబోతోంది. కోనసీమకు రైలు రావాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. కోనసీమ వాసుల కోరికను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

పోలీసులపైనా వైసీపీ మూకల దాష్టీకాలు- ఐదేళ్లుగా దాడులు, దౌర్జన్యాలతో బెంబేలు - YSRCP Attacks on Police Employees

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.