ETV Bharat / opinion

చంద్రబాబు అంటే ఐటీ - జగన్‌ అంటే లూటీ : ప్రతిధ్వనిలో రాజకీయ విశ్లేషకులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 10:37 AM IST

ETV Bharat Pratidhwani
ETV Bharat Pratidhwani

Pratidhwani: రాష్ట్రం బాగుంటే ఇప్పుడున్న మనమే కాదు మన తర్వాతి తరాలు కూడా బాగుంటాయి. దానికి బీజాలు ఇప్పుడే వేయాలి. అలా చేయగల సమర్థుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 'అభివృద్ధి ఎవరిది? వినాశనం ఎవరిది?' అనే అంశంపై ప్రతిధ్వనిలో చర్చించానికి హైదరాబాద్ నుంచి సామాజిక విశ్లేషకులు ఏ శ్రీనివాసరావు, గుంటూరు నుంచి రాజకీయ విశ్లేషకులు ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.

Pratidhwani : రాష్ట్రం బాగుంటే ఇప్పుడున్న మనమే కాదు మన తర్వాతి తరాలు కూడా బాగుంటాయి. దానికి బీజాలు ఇప్పుడే వేయాలి. అలా చేయగల సమర్థుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 'అభివృద్ధి ఎవరిది ? వినాశనం ఎవరిది ?' అనే అంశంపై ప్రతిధ్వనిలో చర్చించానికి హైదరాబాద్ నుంచి సామాజిక విశ్లేషకులు ఏ శ్రీనివాసరావు, గుంటూరు నుంచి రాజకీయ విశ్లేషకులు ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జగన్ వర్సెస్ చంద్రబాబు : శ్రీనివాసరావు మాట్లాడుతూ 'సిద్ధం' సభలు పెట్టి ప్రజలపైయుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి, తాను చేసిన అభివృద్ధి గురించి ఎక్కడా వివరించడం లేదుని, అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌కు అంగీకరించేందుకు ఆయన సిద్ధంగా లేరని అన్నారు. రాజకీయ విమర్శలకు సిద్ధం సభలను వేదికగా చేసుకుంటున్నారే తప్ప అభివృద్ధిపై కాదని. జగన్‌ తన తండ్రి అధికారం సాయంతో లక్షల కోట్ల రూపాయలు కొట్టేశారని. సత్యం రామలింగరాజు వంటి వారిని జైలుపాల్జేశారని తెలిపారు. కులం పేరుతో ఎదుటివారిపై నిందలు మోపారని అన్నారు.

ఏపీలో తాలిబాన్లను మించిన అరాచక రాజ్యం - మరొక అవకాశం ఇస్తే పరిస్థితి ఏంటి?

జగన్ తన సొంత బాబాయి హత్యకు గురైతే ఎదుటివారి చతులకు నెత్తురు పూసి తన పత్రికలో వ్యతిరేక కథనాలు ప్రచురించారని పేర్కొన్నారు. ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసని అన్నారు. అందరి కంటే 20 ఏళ్ల ముందు చూపుతో చంద్రబాబు నాయడు అలోచన చేస్తారన్నారు. ఏ పాలకుడికయినా ఉండాల్సిన దార్శనికత ఇదేన్నారు. చంద్రబాబులో నిరంతరం కష్టపడే గుణం, సంస్కరణల ఆకాంక్ష, దూరదృష్టి, తాను తీసుకునే నిర్ణయాలకు వెంటనే కాకపోయినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనే విశ్వాసం ఉంటాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, ఆపదలప్పుడు ఆయన స్పందన మెరుపు వేగంతో ఉంటుందన్నారు. అతి తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాలో సూక్ష్మసేద్య విధానం ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారన్నారు. ఆయన తర్వాత జగన్‌ వచ్చాక పోలవరం ప్రాజెక్టును పడకేయించారని, రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు సరికదా, ఉన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

జగన్‌ది విధ్వంసం - బాబుది నిర్మాణం : సుబ్బారావు మట్లాడుతూ, అబ్దుల్‌కలాం, వాజ్‌పేయీ, ఆడ్వాణీ వంటి నాయకులతో కలిసి పని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని అన్నారు . చొక్కాలు మడవమనే జగన్‌ భాష చూస్తుంటే గోరంట్ల మాధవ్‌, అంబటి రాంబాబు, కొడాలి నాని వంటి వారి నుంచి ఈ భాష ఆయనకు వచ్చిందా అనే అనుమానం కలగడం సహజమన్నారు. నియంతగా జగన్‌ తన పాలనలో సృష్టించిన విధ్వంసం కొన్ని తరాల పాటు ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు సమర్థంగా పరిపాలించారని గుర్తు చేశారు.

ప్రజాసేవ గాలికొదిలి అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఆర్టీసీ

హుద్‌హుద్‌ తుపాను చేసిన విధ్వంసం నుంచి ప్రజలను ఏ విధంగా చంద్రబాబు కాపాడారనేది ఉత్తరాంధ్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని విమానాల్లో స్వస్థలాలకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయనని, చంద్రబాబు అంటే ఐటీ, జగన్‌ అంటే లూటీ అని పేర్కొన్నారు. జగన్‌ది విధ్వంసం - బాబుది నిర్మాణమని అన్నారు. విజనరీగా బాబుకు పేరుంటే ప్రిజనరీగా జగన్‌ ప్రసిద్ధి అన్నారు. జగన్ పేరు వినిపిస్తే కోడి కత్తి, బాబాయి గొడ్డలి వేటు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. జగన్‌ పాలనలో విశాఖలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సు ద్వారా ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని ప్రశ్నిస్తే అధికారపక్షం నుంచి సరైన సమాధానం లేదని తెలిపారు.

మీడియా సంస్థలపై జగన్ యుద్ధం - విలేకరులపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.