తెలంగాణ

telangana

ప్రతిధ్వని: ఈ ఏడాది స్టాక్​మార్కెట్ల భవితవ్యం ఏవిధంగా ఉంటుంది?

By

Published : Jan 1, 2021, 9:19 PM IST

కొత్త ఏడాదిలో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 14 వేల పాయింట్లను దాటింది. దేశంలో కరోనా టీకాకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో.. కొత్త ఏడాదిలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న అంచనాలతో సూచీలు సెంటిమెంట్​ను పెంచాయి. 2020 సంవత్సరంలో కరోనా సంక్షోభంలోనూ ప్రామాణిక సూచీలు వృద్ధిని సాధించాయి. సెన్సెక్స్​ 15 శాతం, నిఫ్టీ 14 శాతం దాకా పుంజుకున్నాయి. స్మాల్​ క్యాప్​ సూచీ 32 శాతం, మిడ్​క్యాప్​ ఇండెక్స్​ 22 శాతం మేర వృద్ధిని సాధించాయి. ఈ నేపథ్యంలో గతేడాది స్టాక్​ మార్కెట్లు పుంజుకున్న విధానం.. ఈ సంవత్సరం స్టాక్​ మార్కెట్ల భవితవ్యం ఏవిధంగా ఉంటుందనే అంశాలపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details