కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలతో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు లారీలో ఉన్న క్లీనర్, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST