తెలంగాణ

telangana

స్వార్థంతో ప్రకృతి సంపద కనుమరుగు.. కొండలు, గుట్టలు స్వాహా

By

Published : Aug 8, 2021, 2:42 PM IST

కొందరు అక్రమార్కుల స్వార్థ ప్రయోజనాల కారణంగా ప్రకృతి సంపద అంతరించిపోతోంది. డబ్బుకోసం ఏకంగా కొండలు, గుట్టలనే కరిగించేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లిలోని చెక్‌డ్యాంను పునర్నిర్మిస్తున్న ఓ సంస్థ... నాలుగు రోజుల్లో ఓ గుట్టనే నేలమట్టం చేయడం గమనార్హం.

hill digging at thangellapally, contractor hill digging
స్వార్థంతో ప్రకృతి సంపద కనుమరుగు, కొండలు, గుట్టలు స్వాహా

గుట్ట నేలమట్టం

స్వార్థ ప్రయోజనాలకు ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరి ఆగడాలకు కొండలు, గుట్టలు సైతం చూస్తుండగానే స్వాహా అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో ఇటీవల భారీ వర్షాలకు చెక్‌డ్యాం కొట్టుకుపోయింది. పునర్నిర్మాణం చేస్తున్న గుత్తేదారు సంస్థ.... చెక్‌డ్యాంలో మట్టిని నింపేందుకు సమీపంలో ఉన్న గుట్టను తవ్వేసింది. నాలుగు రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వుతూ... చెక్‌డ్యాంలో నింపటమే కాకుండా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు సైతం ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు.

చెక్‌డ్యాంలతో పాటు ఇతర ప్రాంతాలకు తరలింపు

తంగళ్లపల్లి మోయ తుమ్మెద వాగు ఒడ్డున వేణుగోపాల స్వామి ఆలయం ఉండగా... సమీపంలో ఆలయానికి చెందిన స్థలంలో ఏపుగా పెరిగిన చెట్లతో కూడిన గుట్ట ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మిస్తున్న సహ్యాద్రి గుత్తేదారు సంస్థ గుట్టను తవ్వడం మొదలు పెట్టింది. ఇలా దాదాపుగా కొండను నేలమట్టం చేశారు.

తవ్విన గుట్టను పరిశీలిస్తున్న అధికారులు

ఎట్టకేలకు విషయం తెలుసుకున్న గనులశాఖ అధికారులు... గుత్తేదారు సంస్థ ఆగడాలను అడ్డుకున్నారు. మైనింగ్ ఇన్‌స్పెక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపిన ప్రాంతంలో విచారణ జరిపిన అధికారులు... కొలతలు తీసుకున్నారు. గుత్తేదారుకు రూ.56,480 జరిమానా విధించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:రైతులకు శుభవార్త.. సోమవారమే ఖాతాల్లోకి డబ్బులు

ABOUT THE AUTHOR

...view details