తెలంగాణ

telangana

సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి భీష్ముడే: ముఠా గోపాల్‌

By

Published : Feb 23, 2021, 5:35 PM IST

ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్ప వ్యక్తి భీష్ముడని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. హైదరాబాద్‌లోని‌ ముషీరాబాద్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన వేషధారణ విశేషంగా అలరించింది.

MLA Mutha gopal attended for Bhishma ekadashi celebrations in musheerabad in hyderabad
భీష్ముని వేషధారణ ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్

సమాజ వ్యవస్థను ప్రభావితం చేసిన మహానీయుడు భీష్మ పితామహుడని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఏర్పాటు చేసిన వేషధారణ ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది.

భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడని అన్నారు. ధర్మ సంస్థాపన కోసం భూలోకంలో అవతరించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వారిలో భీష్ముడిదే మొదటి స్థానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు పెద్దఎత్తున పాల్గొని ఊరేగింపు నిర్వహించారు.

ఇదీ చూడండి :'చిన్న పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు ఉపయుక్తం'

ABOUT THE AUTHOR

...view details