తెలంగాణ

telangana

ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.. ఆభరణాలు మాయం

By

Published : Jan 11, 2021, 12:45 PM IST

ఎల్లమ్మ ఆలయంలో చొరబడి హుండీలోని ఆభరణాలు ఎత్తికెళ్లిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు.

theft at kodurupaka yellamma temple in rajanna sircilla district
కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి హుండీలోని ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఉదయాన్నే గమనించిన ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు. దాదాపు రూ.5లక్షల విలువగల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details