తెలంగాణ

telangana

పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష- త్వరలోనే కొత్త చట్టం!

By

Published : Oct 20, 2021, 5:54 PM IST

పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రలకు శిక్ష పడేలా కొత్త చట్టాన్ని(china news law) తీసుకురానుంది చైనా. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. చిన్నారుల ప్రవర్తన చెడుగా ఉన్నా, నేరాలకు పాల్పడినా.. తల్లిదండ్రులకు భారీ జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధించనుంది(china latest news).

China's new law to hold parents responsible for children's criminal behavior
పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రలకు ఐదు రోజలు జైలు!

పిల్లలు చెడుగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా తల్లిదండ్రులను శిక్షించేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది చైనా(china news law). 'ఫ్యామిలీ ఎడ్యుకేషన్​ ప్రమోషన్​ లా' పేరుతో దీన్ని తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలోనే దీనిపై పార్లమెంటులో ఓటింగ్ జరగనుంది(china latest news).

ఈ చట్టం ప్రకారం(china children law) పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, ఏమైనా నేరాలకు పాల్పడినా తల్లిడంద్రులకు సమాచారమిచ్చి ఫ్యామిలీ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలను వివరిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల తప్పులను సరిదిద్దకపోతే(china Family Education Law) వారు పనిచేసే యజామానులకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. అనంతరం శిక్షణ ఇప్పిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ట్రైనింగ్​కు హాజరు కాకపోతే 156 డాలర్ల(రూ.11,600) జరిమానా విధిస్తారు. ఐదు రోజుల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి చాలా కారాణాలున్నాయని, తల్లిదండ్రులు వారి పట్ల శ్రద్ధ వహించకపోవడమూ ప్రధాన కారణమని చైనా చట్టసభ వ్యవహారాల కమిషన్​ అధికార ప్రతినిధి జాంగ్ తైవే తెలిపారు. కమ్యూనిస్టు పార్టీని, దేశాన్ని, ప్రజలను, సామ్యవాదాన్ని ప్రేమించేలా పిల్లలకు బోధించడం తల్లిదండ్రుల బాధ్యతని కొత్త చట్టం చెబుతోందన్నారు.

కొత్త చట్టం(china news ) ప్రకారం పిల్లలు విశ్రాంతి తీసుకునేందుకు, వ్యాయామం చేసేందుకు తల్లిదండ్రులు ఎక్కువ సమయం ఇవ్వాలి. ట్యూషన్లు, హోంవర్క్​ పేరుతో వారిపై ఒత్తిడి పెంచకూడదు.

ఇటీవలి కాలంలో చైనా(china latest news).. పిల్లలు, యువత, కుటుంబాల కోసం తరచూ కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు కనేందుకు కూడా అనుతించింది. చైనాలో జననాల రేటు ఆందోళనకర స్థాయిలో తగ్గిన నేపథ్యంలో 2015వరకు ఉన్న ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తివేసింది.

పిల్లలు బద్ధకంగా తయారవుతున్నారని, సంస్కృతిని నాశనం చేస్తున్నారనే కారణంతో ఈ ఏడాది ఆగస్టులో కొత్త నిబంధన తీసుకొచ్చింది చైనా. మైనర్లు వారానికి మూడు గంటలు మాత్రమే కంప్యూటర్​ విడీయో గేమ్స్​ ఆడాలని షరతు విధించింది. శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు గంట మాత్రమే అనుమతిచ్చింది. హింస, అసభ్య, పరుషపదజాలం ఉండే పిల్లల టీవీ షోలపైనా నిషేధం విధించింది.

ఇదీ చదవండి: మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు- ఆపరేషన్ సక్సెస్!

ABOUT THE AUTHOR

...view details