తెలంగాణ

telangana

బైక్​ను ఢీకొట్టి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన లారీ.. ఒళ్లు గగుర్పొడిచేలా 'సీసీ' దృశ్యాలు

By

Published : Jan 16, 2023, 7:06 PM IST

Warangal Road accident Today : వరంగల్​ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకొంది. ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

Road accident in Warangal
Road accident in Warangal

Warangal Road accident Today : వరంగల్​ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం చక్కు తండాకు చెందిన తల్లీకుమారుడు వరంగల్​-ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇరువురూ కింద పడిపోగా.. కుమారుడు బానోత్​ వెంకన్న లారీ చక్రాల కింద చిక్కుకుపోవడంతో లారీ అతడిని కొంత దూరం ఈడ్చుకు వెళ్లింది. దీంతో తల భాగం, మొండం వేరుకాగా అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి కైకకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి ఆమెను వెంటనే తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో వాహనాలు నిలిచిపోగా.. ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటగా.. ఘటనకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు మరింత కలవరపరుస్తున్నాయి.

బైక్​ను ఢీ కొట్టి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన లారీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details