తెలంగాణ

telangana

ఉస్మానియాలో సాయంత్రం ఓపీ ఉంది తెలుసా!

By

Published : Oct 18, 2022, 9:25 AM IST

Evening OP problems at Osmania Hospital: రోగులకు సులభమైన సేవలను అందించే లక్ష్యంతో సర్కారు ఈ ఏడాది నుంచి సాయంత్రం ఓపీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తీసుకువచ్చిన ఏం లాభం చెప్పండి.. ప్రజల నుంచి స్పందన కొరవడింది. దీంతో సాయంత్రం ఓపీ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని సర్కారు కోరుతోంది.

Osmania Hospital
ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రిలో సాయంత్రం ఓపీ సేవలు

Evening OP problems at Osmania Hospital: రోగులకు వీలైనంత త్వరగా, సులభతర సేవలు అందించే లక్ష్యంతో సర్కారు ఈ ఏడాది జులై నుంచి సాయంత్రం ఓపీలను అందుబాటులోకి తెచ్చింది. గాంధీ, ఉస్మానియా సహా ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో నిత్యం ఉదయం వేళల్లో దాదాపు రెండు వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్ , జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ విభాగాలకు చెందిన రోగులే ఉంటున్నారు.

సాయంత్రం ఓపీ..రోగుల తాకిడి తగ్గించటం, వీలైనంత త్వరగా సేవలు అందించే భావనతో సాయంత్రం ఓపీని రోగులకు అందుబాటులోకి తెచ్చింది. సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు ఆయా విభాగాల వైద్యులు సేవలందిస్తారు. సాయంత్రం ఓపీ సేవల్లో పాల్గొనే వైద్యులకు మరుసటి రోజు విధులకు వెసులుబాటు కల్పిస్తున్నారు. కేవలం వైద్యులు మాత్రమే కాకుండా పరీక్షలు చేసే ల్యాబ్‌లు, మందులు కూడా ఇవ్వాలని జనం కోరుతున్నారు.

కొరవడిన ఆదరణ.. సర్కారు సదుద్దేశంతో సాయంత్రం ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చినా ప్రజల నుంచి ఆదరణ కొరవడింది. ఉదయం దాదాపు రెండు వేలమందికి పైగా సేవలందించే ఉస్మానియా ఆస్పత్రిలో సాయంత్రం ఓపీకి వందలోపే ఉంటున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో సేవలు అందిస్తున్నా సమాచార లోపం వల్ల ఎవరూ రావడం లేదు. గాంధీ ఆస్పత్రిలో గైనకాలాజీ సహా ఐదు విభాగాల్లో ఓపీ సేవలు ఉన్నా చాలా స్వల్పసంఖ్యలో మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. సాయంత్రం ఓపీ పట్ల సరైన ప్రచారం లేకపోవటం, సీనియర్ వైద్యులు ఉంటారో లేదో అన్న అనుమానంతో ఎవరూ పెద్దగా రావడం లేదని తెలుస్తోంది.

ఉస్మానియా ఆసుపత్రిలో రోజుకు 2500 నుంచి 2600 వరకు ఓపీ సేవలు ఉంటున్నాయి. సాయంత్రం ఓపీలు ప్రారంభించి 3 నెలలు అయ్యింది. మెడిసిన్​ సర్జరీ, ఆర్థోపెడిక్​ ఓపీని సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల మధ్య ఇవ్వడం జరుగుతోంది. దీనిపై స్పందన కొంచెం తక్కువగా ఉంటోంది. రోజుకి 50 నుంచి 60 ఓపీల మధ్యనే వస్తోంది. సాయంత్రం సమయాల్లో కూడా అసిస్టెంట్​ ప్రొఫెసర్​లనే ఈ ఓపీలు చూస్తున్నారు. దయచేసి ప్రజలు అందరూ ఈ విషయాన్ని గమనించగలరు. - డా. నాగేంద్ర, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్

పూర్తి ఉచితంగా రోగుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సాయంత్రం ఓపీ సేవలను వినియోగించుకోవాలని సర్కారు కోరుతోంది. రోగులు తక్కువ సమయంలోనే సేవలు పొందవచ్చని చెబుతోంది. సాయంత్రం సమయాల్లో కూడా సీనియర్​ డాక్టర్​లనే ఓపీ సేవలు చూస్తారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details