తెలంగాణ

telangana

యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అమిత్ షా 'మెగా స్కెచ్'!

By

Published : Nov 3, 2021, 1:21 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు(up assembly election 2022) అమిత్ షా తిరుగులేని వ్యూహాన్ని సిద్ధం చేశారని భాజపా వర్గాలు తెలిపాయి. దీపావళి తర్వాత ఈ ప్రణాళికలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. పార్టీ ఏర్పాటు చేసిన ప్రచార బృందాలు ప్రతి విడత తర్వాత నివేదికను నేరుగా అమిత్​ షాకు(Amit Shah news) అందిస్తాయని, వాటికి అనుగుణంగా పార్టీ అజెండాను మార్చుకుంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ముందుకుసాగుతామని భాజపా సీనియర్ నేత ఒకరు చెప్పారు.

UP Polls 2022
యూపీ ఎన్నికలకు అమిత్ షా మెగా ప్లాన్​

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​లో(up assembly election 2022) మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది భాజపా. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల బాధ్యతలను కేంద్రం హోంమంత్రి, వ్యూహరచనలో చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా(Amit Shah news) తీసుకున్నారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు 'షా హై తో రా హై'(అమిత్ షా ఉంటే మార్గమున్నట్లే) అనే నినాదంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం(uttar pradesh election 2022) అమిత్ షా సిద్ధం చేసిన మెగా ప్లాన్​ను భాజపా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం పార్టీ ఏర్పాటు చేసిన బృందాలన్నీ ఎన్నికల ప్రచారం ఒక్కో విడత తర్వాత నివేదికను షాకు అందిస్తాయి. దీనికి అనుగుణంగా ఎన్నికల అజెండా, వ్యూహాలను ప్రతి విడత తర్వాత మార్చుతూ భాజపా ప్రచారంలో(bjp up election 2022) ముందుకు సాగుతుంది. ఈ వ్యూహాలు, అజెండాను పార్టీ ప్రచార కమిటీ, ఐటీ సెల్​ సిద్ధం చేస్తాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తాయి.

దీపావళి తర్వాత ఈ మెగా ప్లాన్​ను ఉత్తర్​ప్రదేశ్ వ్యాప్తంగా(bjp uttar pradesh news ) పూర్తి స్థాయిలో అమలు చేస్తామని భాజపా వర్గాలు తెలిపాయి. ఉత్తర్​ప్రదేశ్ ఓటర్ల నాడిని అమిత్​ షా(amit shah news latest) పట్టుకున్నారని, భాజపాను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయనకంటే పెద్ద వ్యూహకర్త మరెవరూ లేరని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి:'మోదీ మళ్లీ పీఎం అవ్వాలంటే.. యోగి సీఎం కావాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details