తెలంగాణ

telangana

దళితుడిపై దారుణం.. ఏ మతమో చెప్పాలని స్తంభానికి కట్టేసి, బట్టలు విప్పి..

By

Published : Aug 7, 2022, 7:04 PM IST

Dalit Youth Thrashed: సోయా ప్యాకెట్లు దొంగిలించాడన్న అనుమానంతో.. ఓ దళిత యువకుడిని కొందరు దుండగులు చితకబాదారు. బట్టలు విప్పి అమానవీయంగా ప్రవర్తించారు. ఆశ్చర్యం ఏంటంటే.. పోలీసులు బాధితుడిని అరెస్టు చేశారు.

Dalit youth thrashed, stripped down by mob to 'know his religion'; police arrests victim
Dalit youth thrashed, stripped down by mob to 'know his religion'; police arrests victim

Dalit Youth Thrashed: మధ్యప్రదేశ్​ ఖర్​గోన్​లో దారుణ ఘటన జరిగింది. సోయా ఫుడ్​ ప్యాకెట్లు దొంగిలించాడన్న అనుమానంతో.. దళిత యువకుడిపై మూక దాడి చేశారు. అతడి మతమేంటో తెలుసుకునేందుకు బట్టలు పూర్తిగా విప్పి చూశారు దుండగులు. స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఖర్​గోన్​ జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమ్రానీ పారిశ్రామిక ప్రాంతం వద్ద ఈ అమానవీయ ఘటన ఆగస్టు 2న జరిగింది.

బాధితుడిని 32 ఏళ్ల చీకూ రోకడేగా గుర్తించారు. విచిత్రమేంటంటే.. పోలీసులు నిందితులను పట్టుకోకుండా.. బాధితుడిని అరెస్టు చేశారు. తన కుమారుడు హిందువా, కాదా అని చూసేందుకు చిత్రహింసలు పెట్టారని బాధితుడి తల్లి ఆరోపించింది. దళితుడిని కొట్టిన వీడియో సోషల్​ మీడియా వైరల్​ అయిన నేపథ్యంలో.. ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన పోలీసును సస్పెండ్​ చేశారు. సోయాఫుడ్​ కంపెనీకి చెందిన నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీస్​ అవుట్​పోస్ట్​ ఇంఛార్జ్​ రాజేంద్ర సింగ్​ భగేల్​.. బాధితుడిని అరెస్టు చేసి, నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో విచారణకు ఆదేశించారు ఖర్​గోన్​ ఎస్​పీ ధర్మవీర్​ సింగ్​.

ABOUT THE AUTHOR

...view details