తెలంగాణ

telangana

కొండపై 80అడుగుల కుంట.. 90ఏళ్ల వృద్ధుడి భగీరథ ప్రయత్నం.. 50ఏళ్లు శ్రమించి..

By

Published : Jul 24, 2022, 8:34 PM IST

నీరు లేక పక్షులు, జంతువులు చనిపోవడాన్ని చూసి చలించారు ఆ వృద్ధుడు. వాటి కోసం ఏదైనా చేయాలని పరితపించారు. అనుకున్నదే తడువుగా వాటి దాహార్తిని తీర్చడానికి ఏకంగా కొండపైనే ఓ కుంటను నిర్మించారు. 50 ఏళ్లు శ్రమించి కుంటను నిర్మించిన ఆ 90 ఏళ్ల వృద్ధుడి కథేంటో తెలుసుకుందాం

90 year old man built pond on hill
కుంట వద్ద కల్లూరామ్​

కొండపైన 80 అడుగుల కుంట.. 90 ఏళ్ల వృద్ధుడి భగీరథ ప్రయత్నం

హరియాణా ​చర్ఖీ దాదరిలోని అటెలా కలాన్​ గ్రామానికి చెందిన కల్లూరామ్​.. పక్షులు, జంతువుల దాహార్తిని తీర్చడానికి ఏకంగా కొండపైనే ఓ కుంటను నిర్మించారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న ఆయన.. 80 అడుగుల లోతైన కుంటను నిర్మించారు. 50 ఏళ్ల పాటు శ్రమించి 2010లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ కుంట నిర్మాణంతో ఏటా అనేక పక్షులు, జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి.

కుంట వద్ద కల్లూరామ్​

18 ఏళ్ల వయసులో ఉండగా.. కల్లూరామ్ పశువులను మేపడానికి కొండపైకి వెళ్లేవారు​. ఆ సమయంలో అనేక పక్షులు, జంతువులు దాహర్తికి తట్టుకోలేక మరణించేవి. దీన్ని చూసి కలత చెందిన కల్లూరామ్​.. ఈ సమస్య పరిష్కారానికి ఏదైనా చేయాలని అనుకున్నారు. జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ఏకంగా కొండపైనే ఓ నీటి కుంటను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా సుత్తి, ఉలిని తీసుకుని కొండను తొలచడం ప్రారంభించారు.

కల్లూరామ్ నిర్మించిన కుంట
సేకరించిన రాళ్లతో కల్లూరామ్​

ఈ కుంట నిర్మాణం ప్రారంభించినపుడు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు అందరూ తనని విమర్శించారని కల్లూరామ్​ గుర్తు చేసుకున్నారు. అందరూ అవహేళన చేసినా.. పక్షులు, జంతువులకు ఏదైనా చేయాలన్న​ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు కల్లూరామ్​. కుంట నిర్మాణం పూర్తయ్యాక రహదారి నిర్మాణంలో కుమారుడు, మనుమడు సహాయం అందిస్తున్నారని తెలిపారు. మైనింగ్ వల్ల ఈ కుంట ధ్వంసమవుతోందని కల్లూరామ్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుంటను సందర్శించిన ఎంపీ ధరంబీర్​సింగ్​

ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న కల్లూరామ్​.. ఇప్పటికీ ఉదయం నాలుగు గంటలకే లేచి కొండపైకి వెళుతున్నారు. రెండు కిలోమీటర్ల ఎత్తులోని కొండను ఎక్కి.. అక్కడ రాళ్లను సేకరించి ఆ కుంట చుట్టూ అందంగా పేర్చుతున్నారు. ఆ కుంటను చేరుకోవడానికి దారిని ఏర్పాటు చేస్తున్నారు. కొండపై కుంటను నిర్మించిన విషయం తెలుసుకున్న ఎంపీ ధరంబీర్​సింగ్​.. ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆయనను అభినందించారు. అయితే ఈ కుంట వరకు రహదారిని నిర్మించాలని కల్లూరామ్​ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 50మీటర్ల దూరంలో శరీరభాగాలు!

ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం.. ఆదివాసీ సంప్రదాయాలతో వైభవంగా..

ABOUT THE AUTHOR

...view details