ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Woman Suicide Attempt in front of MRO Office: తహశీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 6:29 PM IST

Woman_Suicide_Attempt_in_front_of_MRO_Office

Woman Suicide Attempt in front of MRO Office: అనంతపురంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన తహశీల్దార్ శ్రీధర్ మూర్తి తన వాహనంలోనే మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటుకలపల్లి గ్రామ సమీపంలో రెండు ఎకరాల పొలం విషయంలో జరిగిన వివాదంలో తహశీల్దార్ తనకు న్యాయం చేయలేదని.. మనస్థాపంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు బంధువులు తెలిపారు. ఏడాది నుంచి ఆమె మరిది చిన్న నరసింహులు పొలాన్ని సాగు చేసుకుంటున్నాడని, అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు కారణంగా వివాదం నడుస్తోందని తహశీల్దార్​ తెలిపారు. మూడుసార్లు పోలీసు ప్రొటెక్షన్​తో పొలం నాగలక్ష్మికి ఇవ్వాలని సూచించినా, చిన్న నరసింహులు అనే వ్యక్తి.. నాగలక్ష్మి భర్త నుంచి ఆ పొలాన్ని కొనుగోలు చేసినట్లు రాతపూర్వకంగా చూపిస్తున్నాడన్నారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవ కారణంగా ఈ విషయంలో ఎటు తేల్చలేకపోయామని తహశీల్దార్​ తెలిపారు. అయితే ఇలాంటి ఘటనకు పాల్పడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నాగలక్ష్మికి న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్​ తెలిపారు. ప్రస్తుతం నాగలక్ష్మి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details