ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేసు కుక్కల దాడికి వన్యప్రాణులు విలవిల : చోద్యం చూస్తోన్న అటవీ శాఖ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 2:36 PM IST

wild_dogs_attcking_in_animals_in_tirupati_district

Wild Dogs Attcking In Animals In Tirupati District: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ సమీప ప్రాంతాలలో వన్యప్రాణులపై రేసు కుక్కలు దాడి చేస్తుండటంతో  గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ రేసు కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి చెందింది. దుప్పిపై రేసు కుక్కలు దాడి చేస్తున్నాయంటూ అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం ఇస్తే వారు స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే దుప్పి ప్రాణాలతో బయట పడేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా వేట కోసం కొందరు కుక్కలకు శిక్షణ ఇస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 7వ తేదీన రెండు వేట కుక్కలను, ముగ్గురు వేటగాళ్లును అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారపార్టీ స్థానిక కార్యకర్తలు కావడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు వదిలేశారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా శేషాచలం అడవుల్లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని చుట్టు పక్కల గ్రామస్థులు మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details