ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాగునీటి సరఫరా నిలిపివేసిన గుత్తేదారులు - సమ్మెకు దిగిన ట్యాంకర్ల యజమానులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 4:07 PM IST

water_tank_contractors_protest_in_prakasam_district

Water Tank Contractors Protest In Prakasam District : ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పోరేషన్‌ పరిధిలోని శివారు కాలనీలకు తాగునీటి సరఫరా చేసే ట్యాంకర్ల యజమానులు ఒక్క సారి సమ్మెకు దిగారు. దాదాపు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల గుత్తేదారులు ఈ రోజు ట్యాంకర్లను నిలిపివేశారు. రూ. 2.5 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయని తెలిపారు. దాదాపు 35 ట్యాంకుల ద్వారా నగర శివారు కాలనీలకు నిత్యం నీటిని సరఫరా చేస్తారు. 

Water Problems in Ongole : ఒక్కో ట్యాంకు ద్వారా ఆరేడు ట్రిప్పులు నీటిని సరఫరా చేస్తారు.  రంగరాయ చెరువు సమీపంలో ఉన్న ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న వాటర్‌ హెడ్‌ వర్క్స్‌ నుంచి నీటిని పంపింగ్‌ చేసి ప్రజలకు సరఫరా చేస్తారు. గుత్తేదారులు ఆపడంతో ట్యాంకులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఎండాకాలం కాకపోయినా తమకు ఈ నీటి కష్టాలు ఏంటని విసిగిపోయిన ప్రజలకు చోదోడు వాదోడుగా ఉన్న నీటి ట్యాంకర్ల నిలిపివేతతో ఒంగోలు శివారు ప్రాంత వాసులకు ఇక్కట్లు తప్పలేదు.

ABOUT THE AUTHOR

...view details