ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భక్తులకు శుభవార్త - వారానికి రెండు సార్లు విశాఖ నుంచి కాశీకి రైలు సర్వీస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 9:59 AM IST

Visakhapatnam_to_Varanasi_train_service_started

Visakhapatnam to Varanasi Train Service Started: ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరిక విశాఖ నుంచి కాశీకి నేరుగా రైలు సర్వీసు సాకారం అయిందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) అన్నారు. విశాఖ రైల్వేస్టేషన్​లో కాశీకి వెళ్లే రైలు వద్ద జీవీఎల్ ప్రత్యేక పూజలు చేసి గుమ్మడికాయ కొట్టారు. ఈ సందర్భంగా మేళతాళాలతో, కోలాట నృత్యాలతో రైల్వేస్టేషన్​లో జీవీఎల్​కు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరిక.. కాశీకి నేరుగా రైలు సర్వీసు సాకారం అయిందని.. రైల్వే శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సంప్రదింపులకు ఫలితం దక్కిందని అన్నారు. 

విశాఖ నుంచి వారానికి రెండు సార్లు రైలు మంజూరైందని.. ప్రతి బుధ, ఆదివారాల్లో విశాఖ నుంచి తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్రతి గురు, సోమవారాల్లో కాశీ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని అన్నారు. విశాఖ నుంచి 25 గంటల ప్రయాణంతో కాశీకి నేరుగా చేరుకోవచ్చునని.. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారి అయినా కాశీయాత్ర చేయాలని భావిస్తారని చెప్పారు. మహాదేవుని దర్శించి. తరించాలనే వారికి ఈ రైలు ఒక మంచి అవకాశమని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details