ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Union Minister Narayanaswamy Comments on YSRCP Govt: పథకాలకు కేంద్రం నిధులు.. క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వసూళ్లు: కేంద్ర మంత్రి నారాయణస్వామి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 5:32 PM IST

union__minister_comments_on_ysrcp_govt

Union Minister Narayanaswamy Comments on YSRCP Govt : కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లిస్తూ.. రాష్ట్రంలో తామేదో పలు పథకాలు  అమలు చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయని కేంద్ర మంత్రి విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తుంటే.. ఇక్కడ కలెక్షన్లు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని కేంద్ర సామాజిక న్యాయ సాధికారికత మంత్రిత్వ శాఖ మంత్రి ఎ. నారాయణస్వామి విమర్శించారు. మచిలీపట్నంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటూ... ప్రజలకు తాము ఏదో చేశామంటూ జగన్ ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేవని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్న విషయం దేశ వ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు ఇస్తుంది ఎవరో.. కలెక్షన్లు వసూలు చేస్తుంది ఎవరో తెలుసు అంటూ పరోక్షంగా వైసీపీని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు జగన్ ను ఇంటికి సాగనంపటం ఖాయమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details