ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tirumala Srivari Navaratri Brahmotsavam 2023: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 12:41 PM IST

Tirumala_Srivari_Navaratri_Brahmotsavam_2023

Tirumala Srivari Navaratri Brahmotsavam 2023 :తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం స్వర్ణరథోత్సవం తిరువీధుల్లో వేడుకగా సాగింది. ఉభయదేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి స్వర్ణరథంపై (Swamy on a Golden Chariot) ఆసీనులై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. అలంకార ప్రియుడైన స్వామిని స్వర్ణాభరణాలతో, ఫల పుష్పాలతో సర్వాలంకారభూషితుడై బంగారు తేరుపై స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో వాహనసేవలో పాల్గొని స్వర్ణ రథాన్ని లాగారు. శ్రీవారి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఈ నెల 23వ తేదీన శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నాన మహోత్సవం జరగనుంది.

కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఉదయం మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details