ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Three People Died in Heavy water flow విహారయాత్ర మిగిల్చిన విషాదం..! వాగులో మునిగి ముగ్గురు యువకులు మృతి!

By

Published : Aug 13, 2023, 9:23 PM IST

Three_People_Died_in_Canal

Three People Died in Canal:విహారయాత్రకు వచ్చి వేరువేరు ఘటనలలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఏడుగురు మిత్రులు వెళ్లారు. వారంతా మారేడుమిల్లి సమీపంలోని పాములేరు వాగులో స్నానానికి దిగగా అందులో మునిగి ఇద్దరు యువకులు చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు మాదాల సురేష్ ఆటో డ్రైవర్, తేజస్ వర్మ వాలంటీర్​గా గుర్తించారు. మృతదేహాలను అదే కార్లో రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. 

Another Person Died in Polluru Waterfall:చింతూరు మండలం మోతుగూడెం పొల్లూరు జలపాతంలో ప్రమాదవశాత్తు కాలుజారి సాఫ్ట్​వేర్ పర్యాటకుడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కాజా హేమంత్​గా గుర్తించారు. హేమంత్​ హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్ ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు. రాజమండ్రిలో మిత్రులతో కలిసి ఈ జలపాతానికి వచ్చి జారిపడి మృతి చెందాడు. ఇలా ఆదివారం మన్యం పర్యటనకు వచ్చి విహారంలో మృతి చెందడంతో వారి కుటుంబాలలో విషాదం మిగిలింది.

ABOUT THE AUTHOR

...view details