ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు - కారణమిదే !

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 5:35 PM IST

Son_in_Law_Murdered_Aunt

Son-in-Law Murdered Mother-in-law: పిల్లనిచ్చి పెళ్లి చేసిన అత్తనే.. దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడో అల్లుడు. ఈ దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కలసపాడు మండలం గంగాయపల్లెకు చెందిన బాలమ్మకు, తన అల్లుడు సునీల్​కు మధ్య గతకొంతకాలంగా వ్యక్తిగత గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా అత్తను అంతమొందించాలని సునీల్  నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే.. పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న బాలమ్మను.. గొడ్డలితో దారుణంగా నరికేశాడు. 

Aunt Murder by Axe: ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై బాలమ్మ కోడలు కాంతమ్మ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్​కు తరలించారు. ఈ ఘటనపై ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details