ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Simhachalam Giri Pradakshina: సింహాచల గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. అద్భుతం ఆవిష్కృతం

By

Published : Jul 3, 2023, 8:17 PM IST

గిరి ప్రదక్షిణ

Smhachalam Giri Pradakshina: విశాఖ జిల్లా సింహాచలం గిరిప్రదక్షిణ కార్యక్రమం కోలాహలంగా సాగింది. సింహగిరి ప్రదక్షిణ కోసం లక్షల మంది భక్తులు వెల్లువలా తరలి వచ్చారు. ఆషాడశుద్ధ చతుర్దశి నాడు ప్రారంభించి.. పౌర్ణమి ఘడియలతో గిరి ప్రదక్షిణ ముగింపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ పూర్తి చేసి నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఎండ, వానలను లెక్క చేయకుండా భక్తులు తాము అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు.

ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతుండడం వల్ల ఈ రాత్రి వరకు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. స్వచ్చంద సంస్ధలు, యువజన సంఘాల సేవలు భక్తుల మన్నలను అందుకున్నాయి. సింహాచలం మెట్ల మార్గంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయకపోడం వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది కంటే దాదాపు నాలుగైదు రెట్ల మంది.. ఈ ఏడాది వచ్చారని స్ధానికులు చెబుతున్నారు.

నరసింహస్వామిని తలపించిన వృక్షం: సింహాచలం శ్రీవరాహా లక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణలో.. భక్తులందరూ లక్షల సంఖ్యలో పాల్గొని తమ 32 కిలోమీటర్ల దూరం నడిచే పనిలో ఉన్నప్పుడు వాతావరణం హఠాత్తుగా మారింది. పెద్ద ఎత్తున గాలి వచ్చింది. అదే సమయంలో సింహగిరిపై ఉన్న వృక్షాలు కూడా భారీగా ఊగిసలాడాయి. ఈ సమయంలో ఒక వృక్షం ఊగిన తీరు అచ్చం నరసింహస్వామి రూపాన్నే తలపించింది. ఇది ఒకరు చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి చేయడంతో దీనిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇది వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details