ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మా గోడు వినండి సార్' - సొంత నియోజకవర్గంలో సీఎం జగన్​కు నిరసన సెగ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 7:02 PM IST

Protest_Against_CM_Jagan_in_Pulivendula

Protest Against CM Jagan in Pulivendula: సీఎం జగన్ మోహన్ రెడ్డికి తన సొంత ఇలాకా పులివెందులలో నిరసన సెగ తగిలింది. జగన్ సార్ మా సమస్యలు వినండి.. మా మొర ఆలకించండి అంటూ ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చారు. సీఎం జగన్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు.. సొంత నియోజకవర్గ ప్రజలే గొంతుపోయేలా అరిచిన వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో.. నిన్న, ఈరోజు.. రెండు రోజుల పాటు పర్యటించారు. ఇందులో భాగంగా సీఎం జగన్‌ను.. పెద్దరంగాపురం గ్రామస్థులు కలిసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఏం చేయాలో తెలియక 'సార్‌ మా గోడు వినండి సార్' అని బిగ్గరగా అరిచారు. 

గట్టిగా అరుస్తూ నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు జగన్ దగ్గరకు వచ్చారు. పులివెందుల అభివృద్ది కోసం భూములిచ్చిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకంతో పాటు ఒక ఉద్యోగం ఇస్తామని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారని.. పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా, ఉద్యోగం, పరిహారానికి దిక్కులేదని నిలదీశారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని.. సీఎం సానుకూలంగా స్పందించడంతో బాధితులు వెనుదిరిగారు. 

ABOUT THE AUTHOR

...view details