ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PRATHIDWANI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయంతో ఎలాంటి పరిణామాలుంటాయి?

By

Published : Aug 5, 2022, 9:25 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచేసింది. దీంతో కొవిడ్‌ సంక్షోభం తర్వాత వరుసగా మూడోసారి రెపో రేటు పెంచినట్లైంది. రెపో పెంపునకు అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే దిశగా కదులుతున్నాయి. ఈ మేరకు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన, వ్యవసాయ రుణాలపై వడ్డీల భారం పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మాంధ్యం పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే వడ్డీ రేట్లు పెంచామని ఆర్బీఐ ప్రకటించింది. అయితే... ఈ పెంపుదలతో అన్నిరకాల వస్తువులు, సేవల ధరలు పెరిగిపోతాయని, ప్రజలపై ఆర్థిక భారాలు మరింతగా పెరుగుతాయని ఆర్థికవేత్తలంటున్నారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల చోటుచేసుకునే పరిణామాలపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated :Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details