ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police Seized 250 kg of Ganja at Keesara Tollgate: కీసర టోల్​గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 4:53 PM IST

police_seized_ganja

Police Seized 250 kg of Ganja at Keesara Tollgate:రాష్ట్రంలో గంజాయి రవాణా రోజు రోజుకూ భారీ ఎత్తున జరుగుతుంది. అదే విధంగా గంజాయి రవాణా చేయడానికి స్మగ్లర్లు రోజుకో కొత్త మార్గం వెతక్కుని మరీ గంజాయిని బోర్డర్ దాటిస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు అనేక కొత్త మార్గాల్లో రవాణా చేస్తున్నా.. పోలీసులు వారి మార్గాలను కనిపెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కీసర టోల్​గేట్ వద్ద లారీల అక్రమంగా తరలిస్తున్న 250 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి హర్యానా రాష్ట్రానికి కంటైనర్ లారీల ద్వారా గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో కంటైనర్ లారీలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. లారీని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details