ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో పూజలు చేసిన మహిళలు-మంచిరోజులు వస్తున్నాయంటూ నినాదాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 6:23 PM IST

new_year_women_cleaning_foundation_in_amaravati

New Year Women Cleaning Foundation in Amaravati: నూతన సంవత్సరం సందర్భంగా రాజధాని అమరావతిలో మహిళలు శ్రమదానం నిర్వహించారు. 2024లో మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రాజధానిని అభివృద్ధి చేయాలని మహిళలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్ధండ రాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని రైతులు, మహిళలు శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రం చేసి శిలాఫలకం వద్ద ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. అప్పట్లో సేకరించిన పవిత్రమైన మట్టి, నీటిని నిల్వ చేసిన చోట అమరావతిని రక్షించాలంటూ దేవతలకు పొంగళ్లు సమర్పించారు. ఈ సంవత్సరం వచ్చే నూతన ప్రభుత్వం అమరావతిని గతం కంటే ఎక్కువ అభివృద్ధి చేసేలా కృపను చూపించాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అలాగే అమరావతికి పట్టిన అరిష్టాలు అన్నీ పోయి గొప్పగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు మహిళలు తెలిపారు. అనంతరం అమరావతికి మద్దతుగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు. అమరావతి అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details