ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పేదల సంక్షేమానికి లోకేశ్ నిరంతరం కృషి చేస్తారు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 7:56 PM IST

nara_lokesh_provided_food_carts_to_the_poor_people_in_mangalagiri

Nara Lokesh Given Food Carts to Poor People in Mangalagiri: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు వ్యాపారం చేసుకునేందుకు బండ్లు అందజేశారు. పేదలకు మూడు లక్షల విలువైన తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, రిక్షాలు, సోడా బండ్లను లబ్ధిదారులకు పార్టీ నేతలు అందజేశారు. పేదలు తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు లోకేశ్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పార్టీ నేతలు చెప్పారు.

వచ్చే ఎన్నికలలో లోకేశ్​ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మంగళగిరి ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజలకు సుమారు 22 రకాల సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా లోకేశ్ గెలిస్తే మరిన్ని కార్యక్రమాలు చేపడతారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న పేదల సంక్షేమం కోసం లోకేశ్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారని నేతలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details