ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుటుంబ సమేతంగా తిరుమల స్వామి వారి సన్నిధిలో బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 1:23 PM IST

lalu_prasad_yadav_ttd_darshanam_with_family_members

Lalu Prasad Yadav TTD Darshanam With Family Members : రాష్ట్రీయ జనతా దళ్ ఆధ్యక్షుడు,  బీహార్ మాజీ  ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు. ఇవాళ స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. టీటీడీ (TTD) ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో వెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Lalu prasad Yadav In Tirumala : దర్శనానంతరం టీటీడీ (Tirumala Tirupati devastanam) ఆలయ అధికారులు ఆయనకు  స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకున్నందుకు  సంతోషంగా ఉంది అని లాలూ ప్రసాద్‌  కుమారుడు  బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తెలిపారు. తిరుమల స్వామి వారి దర్శనం వారికెంతో సంతోషంగా ఉందని ఆయన  తెలిపారు. ఆలయ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లతో వారి పూజలు విజయవంతంగా పూర్తయ్యాయి. కుటుంబ సమేతంగా వారు భక్తి శ్రద్ధలతో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details