ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోర్టు ఆర్డర్లను చంద్రబాబు ఎక్కడా అతిక్రమించలేదు: న్యాయవాది లక్ష్మీనారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 8:12 PM IST

HC_Lawyer_Lakshmi_Narayana_Comments

HC Lawyer Lakshmi Narayana on Chandrababu Case: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్ట్) మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో మరిన్ని షరతులు విధించాలని కోరుతూ.. ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణలో ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. నవంబరు 3వ తేదీన తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఐడీ విధించిన షరతులు చంద్రబాబుకు వర్తిస్తాయా..? లేదా..?జైలుశిక్ష పడ్డవారికీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందా..? ఉండదా..? అనే అంశాలపై హైకోర్ట్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.

Lawyer Lakshmi Narayana Comments: ''అడిషనల్ కండిషన్స్ ఇంపోజ్ చేయమని సీఐడీ తరుఫున హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిశాయి.చంద్రబాబు నాయుడి బెయిల్‌లో ఆంక్షలు పెంచటం అనేది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే. సీఐడీ షరతులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. కోర్టు ఆర్డర్లను చంద్రబాబు ఎక్కడ అతిక్రమించలేదు. చంద్రబాబు మాట్లాడటం ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమే. ఎందుకంటే జైలు శిక్ష పడ్డవారికీ మీడియాతో మాట్లాడే అవకాశం గతంలోనే కోర్టులు ఇచ్చాయి. సీఐడీ షరతులు చంద్రబాబు హక్కులు హరించేలా ఉన్నాయి. కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందో సీఐడీ చెప్పలేకపోయింది'' న్యాయవాది వివి లక్ష్మీనారాయణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details