Car Overturned CC Visuals తెలంగాణ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రనగర్ శివారులో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలను తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. వడ్ల కుప్పను తప్పించబోయే క్రమంలో చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST