ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amaravathi Farmers protest in Mandadam : మాట తప్పిన సీఎంను గద్దె దింపే వరకూ పోరాడుతాం.. అమరావతి రైతుల నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 1:04 PM IST

Amaravathi_Farmers_protest_in_Mandadam

Amaravathi Farmers Protest in Mandadam : అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌ వెళుతున్న సమయంలో మందడంలోని దీక్షా శిబిరం వద్ద అమరావతి రైతులు నిరసన తెలిపారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున జెండాలు పట్టుకుని జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకుండా.. సీఎం జగన్​ విశాఖ నుంచి పరిపాలన ఎలా చేస్తారని రైతులు ఆందోళనలు చేపట్టారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాన్వాయ్​ను అడ్డుకుంటారనే అనుమానంతో పోలీసులు శిబిరాన్ని చుట్టుముట్టారు. రైతులు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

రాజధాని అంశం ఇంకా సుప్రీం కోర్టులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పరిపాలను విశాఖ నుంచి ఎలా చేస్తారని మండిపడ్డారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సీఎం రోజుకో మాట చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. అమరావతిని నాశనం చేసి, రాజధాని రైతులను నాశనంచేసి, తమకక్ష నెరవేర్చుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిపై మాట తప్పిన సీఎం జగన్​ను.. గద్దె దింపే వరకు పోరాడుతామని రైతులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details