ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ.90 వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి పట్టుబడిన వీఆర్‌వో

By

Published : Oct 1, 2021, 5:26 PM IST

Updated : Oct 1, 2021, 9:11 PM IST

వీఆర్‌వో
వీఆర్‌వో

17:22 October 01

CDP_VRO@ACB trap_Breaking

కడప జిల్లా పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రంగసముద్రం రెవెన్యూ పొలంలో 20 సెంట్లు ఆన్​లైన్​ చేసేందుకు గుర్రప్ప అనే రైతు నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో రామకృష్ణ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు.

గత కొంత కాలంగా పోరుమామిళ్ల ఎమ్మార్వో కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. ఏ పని జరగాలన్నా వీఆర్వోలకు లంచం ఇవ్వనిదే పనులు జరగడం లేదు. ఈ క్రమంలో గిరినగర్​కు చెందిన గుర్రప్ప.. కడప అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి:CYBER CRIME: కొత్త రకమైన మోసాలకు తెర... లింకులు పంపించి..

Last Updated :Oct 1, 2021, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details