మాజీమంత్రి వైఎస్. వివేకా హత్యకేసులో 107వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం.. సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నను ఇంటర్వ్యూ చేసిన.. కడప, పులివెందులకు చెందిన 5టీవీ ఛానళ్ల రిపోర్టర్లను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో.. విచారణ కొనసాగిస్తున్నారు.