ప్రేమించాడు. జీవితాన్ని పంచుకుంటానని మాటిచ్చాడు. కరోనాతో దొరికిన గ్యాప్ ను వాడుకుని.. ఎస్కేప్ అయ్యాడు. సొంతూరుకు చేరుకుని.. హాయిగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన అతడి ప్రేమికురాలు.. భరించలేకపోయింది. అతని ఊరికి వెళ్లింది. ఎందుకిలా చేశావని నిలదీసింది. అతడిని వదిలి ఉండలేనని తేల్చి చెప్పింది. ఆ సమయంలో.. ఆమె ప్రేమికుడి అసలు స్వరూపం మరోసారి బయటపడింది. అక్కడికక్కడే యువతిని నిర్బంధించిన సదరు ఫేక్ ప్రేమికుడు.. డ్రామా చేశాడు. చివరికి.. విషయం బట్టబయలై.. పోలీసు కేసులో ఇరుక్కున్నాడు.
ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది!
బెంగళూరు టు వెస్ట్ గోదావరి. అక్కడ మొదలైన ప్రేమకథ.. చివరికి గోదారి గట్టున మోసపూరితమని తేలిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన రమేష్.. కర్ణాటక రాజధాని బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసేవాడు. అక్కడే ఓ యువతిని ప్రేమించాడు. కరోనా వ్యాప్తితో బెంగళూరులో ఉండలేని పరిస్థితుల్లో.. తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అనంతరం.. ఏం జరిగిందో కానీ.. తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రమేష్ వ్యవహారం.. బెంగళూరులో ఉన్న ప్రేమికురాలికి తెలిసింది. అక్కడి నుంచి ఈ నెల 4న ఆమె ప్రియుడి ఇంటిని వెతుక్కుంటూ.. నవుడూరుకు చేరింది. తనను మోసం చేసినందుకు రమేష్ తో పాటు.. అతని తల్లిదండ్రులనూ నిలదీసింది.
రాజీ యత్నం విఫలమై... కిడ్నాప్!