ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SUICIDE :కుమారుడి ఆత్మహత్య వార్త విని....ప్రాణాలు తీసుకున్న తల్లి, అమ్మమ్మ

By

Published : Nov 9, 2021, 9:44 PM IST

Updated : Nov 10, 2021, 2:17 AM IST

కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నే నిజాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. మనుమడు తిరిగిరాని లోకాలను వెళ్లిపోయాడనే వార్త ఆ అమ్మమ్మ హృదయాన్ని కలచివేసింది. అనుక్షణం అతని జ్ఞాపకాలతో జీవించలేక.. ఇరువురూ ఉరివేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.

మనస్తాపంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య
మనస్తాపంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య

ఆర్ధిక ఇబ్బందులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. కొడుకు ఆత్మహత్య చేసుకోగా..అది తట్టుకోలేక అమ్మ,అమ్మమ్మ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. భీమవరం దిరుసుమభ్రువారివీధికి చెందిన వేమలమంద కార్తీక్‌ ఈనెల ఏడున

విజయవాడ గవర్నర్ పేటలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అతడి మరణవార్తను భీమవరంలో ఉంటున్న బంధువులకు తెలిపారు. కార్తీక్ మరణవార్త వినగానే అతని అమ్మ ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారి కుంగిపోయారు. కుటుంబానికి

ఏకైక ఆధారమైన కొడుకు మరణాన్ని తట్టుకోలేక కార్తీ అమ్మ, అమ్మమ్మ భీమవరంలో నిన్న అత్మహత్య చేసుకున్నారు. కార్తీక్ భీమవరంలో ఆక్వేరియం బిజినెస్ చేసి నష్టం రావటంతో చెన్నై వెళ్లారని బంధువులు వెల్లడించారు. చెన్నైలో కార్తీక్‌కు కోవిడ్ సోకటంతో లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చిందని.... పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికిగురైన కార్తీక్‌ విజయవాడకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీచదవండి.

Last Updated :Nov 10, 2021, 2:17 AM IST

ABOUT THE AUTHOR

...view details